Mani Ratnam Ponniyin Selvan Movie Release Date: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం చేస్తున్న సినిమా “పొన్నియన్ సెల్వన్”. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రధాన పాత్రలుగా చేసిన విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి ఫస్ట్ లుక్ లు విడుదలయ్యాయి. వీటితో పాటు చిత్రం మొదటి భాగం విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. 2022, సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇక పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన వర్క్ మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. ఇక ఈ సినిమా కథ.. రాజులు, యుద్ధాల నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాలో అత్యున్నత భారీ తారాగణం నటిస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే, అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ పాత్ర కీలకం.
Also Read: పాక్ – ఇండియా మధ్య యుద్ధంలో ఎన్టీఆర్ – అక్షయ్ కుమార్
ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ మహారాణి పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె లుక్ కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ లుక్ లో ఐశ్వర్య రాయ్ నిజంగా మహారాణీలానే ఉంది. ఇక మణిరత్నం ఈ సినిమా తర్వాత ఇక డైరెక్షన్ చెయ్యడు అని, దర్శకత్వం పక్కన పెట్టి, నిర్మాతగా మారాలని మణిరత్నం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని టాక్.

తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ మణిరత్నం సినిమాలను నిర్మించాలనుకుంటున్నారు. కాకపోతే అవి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలకు మాత్రమే మణిరత్నం సినిమాలు చేస్తాడట. అంటే.. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. తనకు నష్టాలు లేకుండా ఉండాలని మణిరత్నం ఆలోచన.
ఇక ఈ “పొన్నియన్ సెల్వన్” సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న చోళులకు సంబంధించిన ఓ నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
[…] Prabhas: ‘సాహో’ ఫలితం పై ప్రభాస్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ప్రభాస్ ఏమన్నాడంటే…సాహో’లో చిన్నచిన్న లోపాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారని నటుడు ప్రభాస్ అన్నారు. ప్రభాస్ లవర్ బాయ్ రోల్ లో నటించిన ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ నేపథ్యంలో బుధవారం ‘రాధేశ్యామ్’ ట్రైలర్ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. […]
[…] Bellamkonda Sreenivas: ప్రభాస్ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా, అలాగే ప్రభాస్ ను టాలీవుడ్ లో రెబల్ స్టార్ ను చేసిన సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే, బాలీవుడ్ ఎంట్రీ కోసం చిరంజీవి ఫార్ములానే బెల్లంకొండ శ్రీను కూడా ఫాలో అవుతున్నాడు. అప్పట్లో రాజశేఖర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అంకుశం’ హిందీ రిమేక్ ‘ప్రతిబంధ్’తో చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. […]