Manchu Lakshmi show Ajay Ghosh Fight: సోషల్ మీడియా లో మీమర్స్ కి ట్రేండింగ్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న సినీ నటుల్లో ఒకరు మంచు లక్ష్మి. ఈమె మాట్లాడే ప్రతీ మాట సోషల్ మీడియా లో ఏ రేంజ్ ట్రోల్స్ కి గురి కాబడుతుందో మనం గతం లో చాలానే చూశాము. ఆమె బాషా అమెరికన్ స్లాంగ్ లో ఉంటుంది. సోషల్ మీడియా లో వచ్చే ఈ ఫన్నీ ట్రోల్స్ ని మంచు లక్ష్మి కూడా సరదాగానే తీసుకుంటూ వచ్చింది. ఇకపోతే రేపు తిరువూర్ హీరో గా నటించిన ‘పాపం ప్రతాప్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం ప్రొమోషన్స్ లో ఏ రేంజ్ లో పాల్గొంటున్నారో మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ మూవీ టీం కనిపిస్తోంది. అయితే ప్రొమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీం తో మంచు లక్ష్మి చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ ఇంటర్వ్యూ లో సినిమాలోని ఒక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు , అందులో కీలక పాత్ర పోషించిన అజయ్ ఘోష్. ఇదిగో వీళ్ళే ఎదో చేశారమ్మా అని ఒక నటుడు అనగా , అందుకు అజయ్ ఘోష్ కౌంటర్ ఇస్తూ ‘రేయ్.. చంపి దెం**’ అంటూ బూతులు మాట్లాడుతూ , ఆ నటుడిపై కాళ్ళెత్తి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . గతం లో సీనియర్ హీరోయిన్ రోజా జీ తెలుగు ఛానల్ లో ‘బ్రతుకు జట్కా బండి’ అనే షో ని నిర్వహించేది గుర్తుందా?, ఆ షో కి స్పూఫ్ గా ఇక్కడ మంచు లక్ష్మి రోజా పాత్ర పోషిస్తూ , రీ క్రియేట్ చేశారు.
ఈ ఫన్నీ స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే రేపు విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు సాయంత్రం నుండి ప్లాన్ చేశారు మేకర్స్. కానీ సెన్సార్ నుండి ఈ సినిమాకు చిక్కులు ఎదురైంది. ఎందుకంటే ఈ సినిమాలోని ఒక సన్నివేశం లో వైల్డ్ యానిమల్ ఉంటుందట. అది కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసిన యానిమల్ నా ?, లేదంటే నిజంగానే ఉపయోగించారా ? అని నిర్ధారణ చేసుకోవడం కోసం , నేడు రావాల్సిన సెన్సార్ సర్టిఫికేట్ ని హోల్డ్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం రేపు విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
View this post on Instagram