Homeఎంటర్టైన్మెంట్Mrs India: మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చెసుకున్న విజయవాడ వనిత

Mrs India: మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చెసుకున్న విజయవాడ వనిత

Mrs India: ఈ ఏడాది మిసెస్ ఇండియా కాంపిటీషన్​లో తెలుగమ్మాయి విజేతగా నిలిచింది. రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో జరిగిన ఈ పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక ఈ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు మిసెస్‌ ఇండియా- 9వ సీజన్‌ పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో పాల్గొనగా.. ఈ క్రమంలోనే అన్ని రౌండ్లలో విజయం సాధిస్తూ ఫైనల్స్ కి 12 మంది బరిలో నిలబడ్డారు.

mallika-billupati-from-vijayawada-selected-as-mrs-india-beauty-pageant

కాగా, ఆ తుడి పోటీల్లో అందర్నీ పక్కను నెట్టి మిసెస్​ ఇండియా కిరీటాన్ని మల్లిక కైవసం చేసుకుంది. మల్లిక ఇన్​స్టాగ్రామ్​ ప్రొఫైల్​ సమాచారం ప్రకారం.. తను విజయవాడకు చెందిన అమ్మాయి కాగా, తండ్రి పేరు సుంకర దుర్గాప్రసాద్​. ఎంబీఏ పూర్తి చేసిన ఈమె.. 2019లో శ్రీమతి అమరావతి టైటిల్​ను గెలుచుకున్నారు. ఆ తర్వాత 2020లో వర్చువల్​గా నిర్వహించిన మిసెస్​ ఏపీ అందాల పోటీల్లో  రెండో స్థానంలో గెలుపొందిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పుడు ఏకంగా మిసెస్ ఇండియా బరిలో దిగి కిరీటాన్నే సొంతం చేసుకున్నారు మల్లిక. ప్రస్తుతం ఆమెకు 19కే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఫాలోవర్స్​కోసం పెడుతూ.. అలరిస్తుంటుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular