Homeఎంటర్టైన్మెంట్Prabhas: ప్రభాస్ - జగన్ అసలు ఎలా పలకరించుకున్నారు ?

Prabhas: ప్రభాస్ – జగన్ అసలు ఎలా పలకరించుకున్నారు ?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో నడుచుకుంటూ వెళ్తున్న బాహుబలి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ షర్ట్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.

Prabhas
Prabhas

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మిగిలిన స్టార్ హీరోలని కూడా తీసుకువెళ్లి.. మొత్తానికి మరోసారి భేటీ అయ్యారు. మహేష్, ప్రభాస్, చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు కూడా సీఎంతో సమావేశం అయ్యారు. అయితే ఎందరు సినీ ప్రముఖులు ఉన్నా ప్రాముఖ్యత మాత్రం ప్రభాస్ కే దక్కింది. ప్రభాస్ – జగన్ అసలు ఎలా పలకరించుకుంటారా అని మిగిలిన హీరోలు, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:  జగన్ తో స్టార్లు భేటీ.. కానీ, ఎన్టీఆర్ కలవట్లేదు !

ఏది ఏమైనా టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని ఎన్టీఆర్ కూడా భావించారు. అయితే ఎన్టీఆర్ భేటీ అయితే.. టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయని.. అందుకే ఎన్టీఆర్ చివరి క్షణంలో తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.

Prabhas
Prabhas

 

ఒకవేళ ఎన్టీఆర్ కూడా ఈ భేటీకి వచ్చి ఉంటే.. ఈ భేటీ అరుదైన భేటీ అయ్యేది. మొత్తానికి ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి జగన్ టికెట్ రేట్లు పెంచేలా ఒత్తిడి చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి.

Also Read: చిచ్చు రేగింది.. ఉద్యోగులు వర్సెస్ ఉపాధ్యాయులు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular