Radhe Shyam: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్, తొలి రిలికర్ సాంగ్స్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ రాతలే పాట సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.
కాగా, ఈ పాటకు కృష్ణకాంత్ రచయితగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమాతోపాటు ఈ పాట గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాధేశ్యామ్ సినిమా పునర్జన్మకు సంబంధించి కథ అని, టైమ్ ట్రావెల్ అని, ట్రైన్లోనే సినిమా మొత్తం జరుగుతుందని ఇలా ఎవరికి వారు ఊహలు అల్లుకుంటున్నారు. అయితే, ఈ కథ ఏంటనేంది వారి ఊహలకు వదిలేస్తున్నానని అన్నారు.
ఇక తను రాసిన ఈ రాతలే పాట గురించి చెప్తూ.. ఆ పాట అందరికీ అర్థం కాదు. విజువల్స్ చూస్తే కానీ, అసలు ఎలా రాయడానికి కారణం తెలియదు. నిజానికి ఈ పాటలోనే సినిమా కథ ఉంది. అని చెప్పుకోచ్చారు కృష్ణకాంత్.ప్రస్తుతం ఈయన శ్యామ్ సింగరాయ్తోపాటు, ది ఘోస్ట్, మేజర్, హిట్2 సినిమాలకూ పాటలు రాస్తున్నారు. కాగా, ప్రభాస్ రాధేశ్యామ్తో పాటు, సలార్, ఆదిపురుష్లోనూ నటిస్తున్నారు. ఇటీవలే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Lyric writer krishnakanth intresting comments on radheshyam movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com