తేజ దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్ . ఆ తర్వాత ‘చందమామ’ మూవీతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతూ.. దాదాపు అగ్రహీరోలందరితో నటించింది కాజల్. ఇక ఇటీవలే గతేడాది అక్టోబర్ 30న సన్నిహితుడయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత అమ్మడు భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ను ఎంజాయ్ చేసింది.
హనీమూన్ సమయంలో ఎప్పటికప్పుడు ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకి కంటి మీద కులుకు లేకుండా చేసింది. ఫొటోస్ లో కాజల్ దంపతులతో పాటుగా వారున్న హోటల్ కూడా హైలైట్ అయ్యింది. ఆ హోటల్ గురించిన ప్రత్యేకలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. హిందూ మహా సముద్రంలో 16 అడుగుల దిగువన నిర్మించిన ‘ది మురక’ హోటల్లోనే కాజల్, గౌతమ్ స్టే చేశారు. ఇది ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ హోటల్. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ హోటల్ క్రింద అంతస్తు పూర్తిగా మునిగి ఉండి , గదులు గ్లాస్ గోడలతో ఉండి సముద్రం లోపలంతా కనిపిస్తూ ఉండటం సూపర్ అనే చెప్పాలి.
ఇక పై అంతస్తులో నీటి మీద తేలియాడుతున్నట్లుగా ఉండే బెడ్ రూమ్లు , లివింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, బార్ ఇలా మరెన్నో ప్రత్యేకలతో లగ్జరియస్ గా ఉంటుంది. ఇంత అందమైన అనుభూతిని ఇచ్చే హోటల్కు అద్దె కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఒక్క రాత్రికి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా 37 లక్షల రూపాయలు. ఈ హోటల్లో కాజల్ అగర్వాల్ జంట 10 రోజులు స్టే చేసింది. దీంతో హోటల్ అద్దె, ఆహారం, ఇతర సైట్సీయింగ్ ఖర్చులతో కలుపుకుని మొత్తం మీద కాజల్కు అయిన ఖర్చు అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. అయితే, ఈ ఐదు కోట్ల రూపాయలను కాజల్ జంట హోటల్కు చెల్లించలేదట.
మాల్దీవులు పర్యాటక రంగాన్ని ఇతర దేశాల్లో ప్రమోట్ చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్లో 5 మిలియన్ల కన్నా ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలకు గది అద్దె, భోజనం, రిటర్న్ టిక్కెట్లు కూడా ఉచితంగా అందిస్తుంది. సెలబ్రిటీలు చేయాల్సిందల్లా ఇన్స్టాగ్రామ్లో తమ ఫొటోలు పోస్ట్ చేసి మాల్దీవులు పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడమే.