Actress jayasudha: పద్నాలుగేళ్ల వయసులో వెండితెరపై కనిపించి.. సహజనటిగా గుర్తింపు పొందారు జయసుధ. ఇప్పటికీ టాప్ హీరోహీరోయిన్లకు అమ్మగా నటిస్తూ.. తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అలా విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. కాగా, ఇటీవలే ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. చివరగా మహర్షి, రూలర్ సినిమాల తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించినట్లు కనిపించలేదు.

అయితే, అందుకు కారణం ఆమె ఆరోగ్యం సరిగా బాగుండటం లేదని, ఆనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాల్లో ఉంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సోషల్మీడియాలో షేర్ చేసిన ఫొటో హాట్టాపిక్గా మారింది.
Also Read: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!
ఎప్పుడూ నిండు మొహంతో కలకలలాడుతూ కనిపించే జయసుధ.. ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. చాలా డిఫరెంట్గానూ ఉన్నాుర. ఈ క్రమంలోనే ఫోటోతో పాటు స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ అంటూ క్యాప్షన్ జోడించారు. అయితే, ఆమెను చూసిన అభిమానులు.. జయసుధ ఇలా అయిపోయిందేమిటిఅంటూ షాక్అవుతున్నారు.
అయితే, ఆమెకు ఏమైంది. ఇలా మారడానికి గల కారణాలేంటనే విషయాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు జయసుధ. కాగా, ఆమె భర్త నితిన్ కపూర్ 2017లో మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దోడికి గతేడాది వివాహం జరిగింది. మరి మళ్లీ జయసుధ సినిమాల్లోకి వస్తుందా.. లేక ఇలాగే మిగిలిన జీవితాన్ని ప్రయాణంలో గడిపేస్తుందా తెలియాల్సి ఉంది.