CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో భేటీ అయి.. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు. కాగా ఈ భేటీకి సంబంధించి జగన్ మాట్లాడుతూ.. అన్నీ విషయాల పై క్లారిటీ ఇచ్చారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ పారితోషికాలతో సంబంధం లేకుండా సినిమా బడ్జెట్ పెరిగిపోతోందని సీఎం జగన్ చెప్పారు. ‘ఇప్పటివరకు కొద్దిమందికి ఎక్కువ, కొందరికి తక్కువ టికెట్ రేట్లు వసూలు చేస్తున్నారు.
CM Jagan
మెగాస్టార్ చిరంజీవి అన్న, నేను దీనిపై విస్తృతంగా చర్చించాం. ఇకపై ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలి. పండుగ రోజు చిన్న సినిమాకు థియేటర్లు దొరకాలి’ అని జగన్ సినీ పెద్దల భేటీలో అన్నారు. అలాగే, అందరికీ న్యాయం జరిగేలా సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తామని సీఎం జగన్ చెప్పారు. ‘రూ.100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా చూడాలి. అలా చూడకపోతే భారీ ఖర్చుతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఆన్లైన్ పద్ధతిలో టికెట్లు అందరికీ మంచిది.
Also Read: అంతా చిరంజీవి వల్లే.. అందరి ప్రశంసలు మెగాస్టార్కే..!
అదే విధంగా ఏడాదికి రూ.1000కే ఓటీటీ లు సినిమాలు ప్రసారం చేస్తున్నాయి. అలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి తగ్గిపోతుంది’ అని సీఎం చెప్పారు. టాలీవుడ్ను విశాఖ నగరానికి కూడా విస్తరించాలని సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం జగన్ కోరారు. ‘విశాఖలో స్టూడియోలకు స్థలాలు ఇస్తాం. తెలంగాణతో పోలిస్తే ఇండస్ట్రీకి 60శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తుంది. విశాఖలో జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం.
tollywood heroes
ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీపడే సత్తా విశాఖకు ఉంది. సినిమా ప్రముఖులు కనీసం 20శాతం షూటింగులను ఏపీలో చేస్తామని చెప్పారు’ అని సీఎం అన్నారు. అలాగే.. ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ కూడా ఇచ్చేలా, జీఎస్టీ మినహాయింపు కూడా ఉండేలా జగన్ నిర్ణయం తీసుకోబోతునట్లు తెలుస్తోంది.
Also Read: ప్రివిలేజ్ నోటీసులతో యుద్ధం మొదలు పెట్టిన టీఆర్ఎస్