Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ నుంచే థమన్‌ కి కరోనా.. ఆందోళనలో కీర్తి...

Mahesh Babu: మహేష్ నుంచే థమన్‌ కి కరోనా.. ఆందోళనలో కీర్తి సురేష్, పరుశురామ్ !

Mahesh Babu:  సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టీమ్ కి కరోనా భయం పట్టుకుంది. ఈ సినిమా కోసం మహేష్ తో కలిసి థమన్‌ సర్కారు వారి పాట మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు. మహేష్ నుంచే థమన్‌ కి కరోనా వచ్చిందని తెలుస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన మహేష్ కి అక్కడే కరోనా అటాక్ అయిందట. కాగా మ్యూజిక్ సిట్టింగ్స్‌ లో థమన్, డైరెక్టర్ పరుశురామ్ తో సన్నిహితంగా మెలిగాడు.

Mahesh Babu
Mahesh Babu

కాగా పరశురామ్ కూడా టెస్ట్ చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక పరుశురాం హీరోయిన్ కీర్తి సురేష్ తో మరియు మిగిలిన టీమ్ మెంబర్స్ తో కూడా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. అందుకే కీర్తి సైతం టెస్ట్ చేయించుకోవాలని ఫిక్స్ అయింది. అలాగే సర్కారు వారి పాట టీమ్‌ మొత్తానికి ఇప్పుడు కరోనా భయం ఎక్కువ అయింది. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఎప్రిల్ 1న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: Rakul Preet Singh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడంటే?

రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టాలని భావిస్తున్న తరుణంలో.. మహేష్ బాబు, థమన్ కరోనా బారిన పడటం గమనార్హం. అందుకే మరో నెల వరకు ఇక ఈ సినిమా షూటింగ్ లేనట్లే. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో మళ్లీ కరోనా బుసలు కొడుతుంది. వరుసగా ప్రతిరోజూ కనీసం ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కరోనా రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం ఉండటం లేదు.

Also Read: Shyam Singha Roy: బాక్సాఫీస్ : ‘శ్యామ్ సింగరాయ్’ ఫుల్ కలెక్షన్స్ డిటైల్స్ !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular