Homeఎంటర్టైన్మెంట్Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో.. కేసీఆర్​కు థ్యాంక్స్ చెప్తూ చిరు...

Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో.. కేసీఆర్​కు థ్యాంక్స్ చెప్తూ చిరు ట్వీట్​

Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతులిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై తాజాగా, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇండస్ట్రీకి మేలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్​కు ధన్యవాాలు తెలిపారు చిరు. ఈ క్రమంలోనే ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేస్తూ.. తెలుగు సినిమా పరిశ్రమ కోరిక మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ ఓనర్లకు అన్ని వర్గాల వారికి నాయ్యం చేకూరేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ గారికి కృతజ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. అంటూ చిరు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

chiranjeevi-says-thanks-to-kcr-on-ts-ticket-rates-new-go

మరోవైపు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గిస్తూ జీఓలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్ల ఓనర్లు, ఎగ్సిబిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి చాలవన్నట్లు.. తనిఖీల పేరుతో కొన్ని థియేటర్లను సీజ్ కూడా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థుతుల్లో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది.

తెంలంగాణ సర్కారు జారీ చేసిన నూతన జీఓ ప్రకారం.. జీఎస్టీ మినహా ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల కోసం, కనిష్ట ధర రూ. 100+GST, గరిష్టంగా రూ.250+GST. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు, ధర రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్‌టీ టిక్కెట్‌కు రూ. 5 (ఎసి), టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్‌లకు అనుమతులు ఇచ్చింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular