Homeఎంటర్టైన్మెంట్Bullet Bhaskar Father: అందరి ముందు రష్మీని అవమానించిన బుల్లెట్ భాస్కర్ తండ్రి... అంతలోనే అనుకోని...

Bullet Bhaskar Father: అందరి ముందు రష్మీని అవమానించిన బుల్లెట్ భాస్కర్ తండ్రి… అంతలోనే అనుకోని ప్రమాదం

Bullet Bhaskar Father: జబర్దస్త్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్ ఫేడ్ అవుట్ అవుతుండగా… మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కే చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఆదరణ సొంతం చేసుకుంటుంది. కామెడీ, డాన్స్, రొమాన్స్, టాలెంట్స్ కలగలిపి సరికొత్తగా షోని ప్లాన్ చేశారు. కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బుల్లెట్ భాస్కర్ తండ్రి రష్మీ గౌతమ్ కి చిన్న ఝలక్ ఇచ్చాడు. స్టేజ్ ఫియర్ లేని బుల్లెట్ భాస్కర్ తండ్రి ప్రొఫెషనల్ కమెడియన్స్ కి ఏమాత్రం తగ్గకుండా కామెడీ పంచ్ లు వేస్తారు.వాళ్లతో చక్కగా కలిసిపోతారు.

Bullet Bhaskar Father
Bullet Bhaskar Father, Rashmi Gautam

ఈ కారణంగా అప్పడప్పుడు ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు షోల్లో సందడి చేస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి బుల్లెట్ భాస్కర్ తండ్రి వచ్చారు. ఈ ఎపిసోడ్ లో అమ్మాయిలు అబ్బాయిలకు మధ్య కొన్ని పోటీలు నిర్వహించారు. ఆ పోటీలను ఉద్దేశిస్తూ రష్మీ… ప్రతిసారి అమ్మాయిలే గెలుస్తున్నారు, అబ్బాయిలు గెలవడం లేదన్నారు. ఈ మాటలకు మైక్ అందుకున్న బుల్లెట్ భాస్కర్ తండ్రి.. అసలు నువ్వు ఎవరు? నువ్వేం మాట్లాడుతన్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ గట్టిగా అరిచారు. ఈ పరిణామానికి రష్మీ షాక్ గురైంది.

Also Read: Samantha- Naga Chaitanya: హీరోయిన్ తో నాగ చైతన్య ఎఫైర్… సమంత సంచలన ట్వీట్, ఏకంగా ఎదురుదాడి!

దానికి ఆమె అవమానంగా ఫీల్ అయినట్లు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. చాలా సహనంగా ఉండే రష్మీ అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే అనంతరం చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. లేడీస్ జెంట్స్ మధ్య కబడ్డీ పోటీ నిర్వహించారు. ఆ అట ఆడుతున్న సమయంలో బుల్లెట్ భాస్కర్ తండ్రి ప్రమాదవశాత్తు స్టేజి పై నుంచి క్రింద పడిపోయాడు. ఈ ప్రమాదంతో అక్కడ ఉన్నవారంతా షాక్ కి గురయ్యారు. ఈ ఆసక్తికర అంశాలతో కూడిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో అలరించింది. అదే సమయంలో బుల్లెట్ భాస్కర్ ట్ తండ్రికి ఏమైందనే ఆందోళన కలుగుతుంది.

Bullet Bhaskar Father
Bullet Bhaskar Father

ఇక ఎప్పటిలాగే ఇది ప్రమోషనల్ స్టంట్ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయాక శ్రీదేవి డ్రామా కంపెనీ టీఆర్పీ తగ్గిందని, ఆదరణ తేవడం కోసమే ఇలాంటి ప్రోమోలు అంటున్నారు. సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వెళ్లిపోగా రష్మీ, పూర్ణ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తో పాటు మరికొందరు జబర్దస్త్ ఆడియన్స్ ఈ షోలో కనిపిస్తున్నారు.

Also Read:Modi Comments on Agneepath scheme: అగ్నిపథ్ పై లోపల ఉన్నదంతా కక్కేసిన మోడీ..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular