Babu Mohan:‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ పై చర్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పవన్ వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం సినీ, రాజకీయాల్లో ఇంకా తీవ్ర దుమారాన్ని రేపుతూనే ఉంది. అయితే తాజాగా సీనియర్ కమెడియన్, రాజకీయ నేత బాబూ మోహన్ కూడా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై కాస్త ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాబూ మోహన్ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

బాబు మోహన్ మాటల్లోనే .. ‘పవన్ కల్యాణ్ గారు చాలా మాటలు మాట్లాడం జరిగింది. అయితే, ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ సైడా ? లేక ప్రకాశ్ రాజ్ సైడా ? అనేదే అర్ధం కాలేదు. కాబట్టి.. ముందుగా పవన్ కల్యాణ్ ఎవరి సైడ్ ఉండబోతున్నారో తేల్చుకోవాలి. ప్రభుత్వం సహకారం ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని సినిమా పరిశ్రమ ఓ విషయం అడిగింది.
అయితే, మధ్యలో పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడారు’ అంటూ బాబు మోహన్ చెప్పుకొచ్చారు. పైగా బాబు మోహన్ ఇంతటితో ఆగకుండా తనదైన శైలిలో పవన్ పై విమర్శలు చేశారు. ‘పవన్ వ్యవహరించిన తీరు సరైనది కాదు’ అంటూ బాబు మోహన్ చాలా క్లారిటీగా తేల్చి చెప్పారు. ఇక పనిలో పనిగా మా ఎన్నికల పై కూడా స్పందిస్తూ.. ‘పవన్ ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా ?’.. పవన్ ఎటు వైపు అనేది తేల్చుకోవాలి’ అంటూ బాబు మోహన్ చెప్పారు.
ఈ క్రమంలో ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఎన్ని ఉన్నా తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి తప్ప, తెర ముందుకు వచ్చి ఇలా మాట్లాడటం పద్ధతి కాదు అని, సరే మాట్లాడినా.. ఏదో చిరాకుతో ఆవేశంగా మాట్లాడటం దేనికి ? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. పవన్ స్పీచ్ వల్ల పరిశ్రమ పరువే పోతుంది’ అని బాబూ మోహన్ చెప్పుకొచ్చారు.