Veerasimha Reddy Pre Release : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన వీర సింహా రెడ్డి ఈ నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 6 వ తేదీన ఒంగోలు లో ఘనంగా నిర్వహించడానికి మూవీ టీం సన్నాహాలు చేసింది..పాసులు కూడా ముద్రించారు.

అన్నీ సజావుగా సాగిపోతుంది అని అనుకుంటున్నా సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది..దీనితో ఒంగోలు లో జరగాల్సిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు హైదరాబాద్ లో జరగనుంది అని నిర్మాతలు తెలియచేసారు..దీనితో నందమూరి ఫ్యాన్స్ ఒక్కసారిగా తీవ్రమైన నిరాశకు గురయ్యారు.
ఇటీవల కందుకూరు లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు నిర్వహించిన రోడ్ షో లో పలువురు తొక్కిసిలాట లో చనిపోయారు..అప్పటి నుండి ఇక రోడ్ షోస్ నిర్వహించరాదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది..ఇప్పుడు వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో జరగడం వల్ల జనాలు అసంఖ్యాకంగా వచ్చే అవకాశం ఉందని. దీని వల్ల మళ్ళీ తొక్కిసిలాట జరిగే ప్రమాదం ఉండడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతి ని ఇవ్వట్లేదని ఒంగోలు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు..
మరోపక్క తెలుగు దేశం పార్టీ నాయకులూ వైసీపీ పార్టీ కావాలనే ఇలా చేస్తుందని..తెలుగు దేశం పార్టీ కి చెందిన వాడు కాబట్టే బాలయ్య ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు..ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతిని నిరాకరించడం తో బాలయ్య బాబు కచ్చితంగా జగన్ కి గట్టి కౌంటర్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.