Allu Arjun Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ని ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోవడం మొదలుపెట్టారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అయితే నేడు ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. నాంపల్లి హైకోర్టు అల్లు అర్జున్ తో పాటు మరో 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ కేసు లో అల్లు అర్జున్ A11 ముద్దాయిగా ఉన్నారు. వచ్చే సోమవారం అల్లు అర్జున్ నాంపల్లి హైకోర్టుకు వచ్చి , విచారణ లో కచ్చితంగా పాల్గొనాలని ఈ సందర్భంగా నాంపల్లి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి అల్లు అర్జున్ ఈ విచారణకు హాజరు అవుతారా?, లేదా వేరే ఏదైనా కారణం తో ఆగిపోతారా అనేది చూడాలి. దీని పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇకపోతే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా బాగుపడలేదు. ప్రాణాపాయ స్థితి నుండి బయట అయితే పడ్డాడు కానీ , ఇప్పటికీ మనుషులను గుర్తు పట్టలేని పరిస్థితి లోనే ఉన్నాడు. ప్రతీ నెల ఆ కుర్రాడి వైద్యానికి అయ్యే ఖర్చు ని భరించలేక తండ్రి పడుతున్న ఇబ్బందులు చూస్తే కన్నీళ్లు రాక తప్పదు. రీసెంట్ గానే అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి , అల్లు అరవింద్ తదితరులు శ్రీతేజ్ ఇంటికి వెళ్లి , వాళ్ళ పరిస్థితులను అడిగి తెలుసుకొని, అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని మాటిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. శ్రీతేజ్ ని అల్లు కుటుంబం మర్చిపోలేదు, చాలా సంతోషం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకొని , అందరి పిల్లలు లాగానే , సంతోషంగా చదువుకుంటూ , ఆడుకుంటూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబై లో జరుగుతోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే పూర్తి కానుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ చిత్రం తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి 2000 కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ , ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాలు నెలకొల్పుతాడో చూడాలి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ మూవీ కి షిఫ్ట్ అవ్వబోతున్నారు.
