యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా తాజాగా ఈ ఉద్యోగ ఖాళీలకు సెకండ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 339 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజైంది.
ఎయిర్ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండగా హైదరాబాద్ నగరంలోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో కూడా కొన్ని పోస్టులు ఉండటం గమనార్హం. https://upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉండగా ఆగష్టు 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరితేదీగా ఉంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్ లో 100 ఖాళీలు, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళలో 22, ఎయిర్ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ లో 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు) 169, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు) 16 ఉద్యోగ ఖాళీలు ఉంటాయి.
రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కమర్షియల్ పైలెట్ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాల ఆధారంగా ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://upsconline.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
నవంబర్ 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష తేదీగా ఉంది. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.