Homeఎడ్యుకేషన్Telangana SSC Results 2025: ఏప్రిల్ 30న తెలంగాణ 10వ తరగతి ఫలితాలు? తల్లిదండ్రులకు కీలక...

Telangana SSC Results 2025: ఏప్రిల్ 30న తెలంగాణ 10వ తరగతి ఫలితాలు? తల్లిదండ్రులకు కీలక సూచన

Telangana SSC Results 2025: తెలంగాణలో ఏప్రిల్ 30న 10వ తరగతి ఫలితాలు విడుదలవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో తెలంగాణ వ్యాప్తంగా 5, 08,385 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మీరు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒక విద్యార్థికి పదవ తరగతి టర్నింగ్ పాయింట్ గా ఉంటుంది. ఇందులో పాస్ అయితేనే తర్వాత ఉన్నత చదువులకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. అందువల్ల పదవ తరగతి ఫలితాలపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు ఆసక్తి ఉంటుంది. అయితే ఇదే సమయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటంటే?

Also Read: ఆకట్టుకుంటున్న ‘సింగిల్’ థియేట్రికల్ ట్రైలర్..మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రీవిష్ణు!

ఇటీవల పరీక్షల ఫలితాలు రిలీజ్ అయిన సందర్భంగా కొందరు విద్యార్థులు సంతోషంగా ఉంటే.. మరికొందరు విద్యార్థులు విచారంగా ఉన్నారు. అయితే ఇంకొందరు మాత్రం తమ ప్రాణాలు తీసుకున్నారు. అయితే చాలామంది పరీక్షల్లో ఫెయిల్ ర్ అయినా వారి కంటే తక్కువ మార్కులు వచ్చాయన్న బాధతోనే ప్రాణాలు తీసుకునే వారిని చూస్తే కలిచి వేస్తోంది. అయితే ముందు జాగ్రత్తగా కొందరు మానసిక నిపుణులు తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించడం ద్వారా పిల్లలను కాపాడుకోవచ్చు అని అంటున్నారు.

ఫలితాలు విడుదలైన సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల వెంటే ఉండడం మంచిది. ఎందుకంటే వారు ఏ క్షణాల్లో అయినా తమ మనసును మార్చుకునే అవకాశం ఉంటుంది. కొందరు విద్యార్థులు ఇతరులతో పోల్చుకొని తమకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి సర్ది చెప్పాలి. మార్కులతోనే జీవితం కాదని.. భవిష్య తంతా ఇంకా ముందే ఉందని వివరించి చెప్పాలి. అంతేకాకుండా పదో తరగతి మార్కులతో ఎటువంటి ప్రయోజనం ఉండదని.. భవిష్యత్తులో చదివే చదువుల కోసం ఇంకా కష్టపడే ప్రయత్నం చేయాలని చెప్పాలి.

పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయితే పరీక్ష మళ్ళీ రాసుకోవచ్చు. కానీ విలువైన ప్రాణం పోతే తిరిగి రాదు అనే విషయాన్ని వారికి గుర్తించాలి. ఇలాంటి విషయంలో వీలైతే వారికి నచ్చిన మొబైల్ లో కొన్ని వీడియోలను చూపించాలి. మానసికంగా వారిని ధైర్యంగా ఉంచడం వల్లనే వారు నిర్భరంగా ఉంటారు.

పరీక్షల ఫలితాల విషయంలో ముఖ్యంగా అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అయితే పరీక్షల ఫలితాల సమయంలో వీరిని ఒంటరిగా అస్సలు ఉండనివ్వకూడదు. ఇటీవల ఒక అమ్మాయికి ఇంటర్లో 440 మార్కులకు 434 మార్కులు వచ్చిన ఏడుస్తూ కూర్చుంది. అంటే ఇంత చిన్న విషయానికి కూడా వారు తట్టుకోలేకపోతుంటారు. ఇక ఫెయిల్ అని తెలిస్తే ఎంతో బాధపడే అవకాశం ఉంటుంది. అందువల్ల పరీక్ష ఫలితాలు విడుదలైన సమయంలో వారి వెంటే ఉండడం మంచిది.

పరీక్షల ఫలితాలు విడుదలైన తరువాత ఒకవేళ వారికి తక్కువ మార్కులు వస్తే.. వారిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే ఇంట్లోనే ఉండడంవల్ల ఒకే విషయంపై పదేపదే ఆలోచిస్తూ ఉంటారు. ఇతర ప్రదేశానికి వెళ్లడం వల్ల పరీక్షల ఫలితాల గురించి మరిచిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా పరీక్షల ఫలితాల సమయంలో తల్లిదండ్రులు వారి వెంటే ఉండడం మంచిది.

Also Read: పెళ్లయిన స్టార్ హీరోతో ఎఫైర్ నడిపి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్…

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Oktelugu Epaper