NPCIL Recruitment 2021: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గేట్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2022 గేట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ నియామకాలను చేపట్టనున్నారని సమాచారం.
ప్రస్తుతం గేట్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సులభంగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, మెకానికల్ బ్రాంచ్ లకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ లేదా తత్సమాన అర్హత ఉండి 2020, 2021, 2022 సంవత్సరాల గేట్ స్కోర్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్ట్ అవుతారో వారిని పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
https://npcilcareers.co.in/mainsite/default.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Npcil recruitment 2021 for engineers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com