
భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 33 టీచర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆఫ్ లైన్ లో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://www.apsbolarum.edu.in/index.html వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 33 ఉద్యోగ ఖాళీలలో కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్, పీజీటీ, టీజీటీ, పీఆర్టీ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్, హిస్టరీ, సైన్స్ ఇతర విభాగాలలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వాళ్లు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
57 ఏళ్ల లోపు అనుభవం ఉన్న అభ్యర్థులు, 30 ఏళ్ల లోపు ఫ్రెషర్స్ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల ఉద్యోగాలకు 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు విషయంలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉన్న నిబంధనలే ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కూడా ఉన్నాయి. సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వాళ్లు ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్) పాసై మూడేళ్ల అనుభవం ఉన్నవాళ్లు లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఎంపిక కావడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండి 55 ఏళ్లు నిండిన ఎక్స్సర్వీస్మెన్ లు సెక్యూరిటీ సూపర్వైజర్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) పాసై 33 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికవుతారు.
ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్–500087 అడ్రస్ కు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.apsbolarum.edu.in/index.html వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జూన్ 5వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.