Homeక్రైమ్‌YouTuber Rachna Gurjar: ఉందని మొత్తం విప్పి చూపించింది.. దొంగలు ఊరుకుంటారా.. ఇప్పుడు ఏడిస్తే ఏం...

YouTuber Rachna Gurjar: ఉందని మొత్తం విప్పి చూపించింది.. దొంగలు ఊరుకుంటారా.. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం..

YouTuber Rachna Gurjar: జేబుకు లేకుండా పర్స్ కొట్టేస్తున్న రోజులు ఇవి. ఒంటికి చెమట చుక్క పట్టకుండా సులువుగా డబ్బులు సంపాదించాలని భావిస్తున్న రోజులు కూడా ఇవే. స్థూలంగా చెప్పాలంటే సాటి మనిషిని మోసం చేయడానికి.. అడ్డగోలుగా దోచుకోవడానికి.. నిలువు దోపిడీ చేయడానికి ఏమాత్రం వెనకాడని రోజులు కూడా ఇవే. అందువల్లే జాగ్రత్తలే తీసుకోవడం మాత్రమే కాదు.. కొన్ని సందర్భాలలో మనల్ని మనం కూడా నమ్మకూడని పరిస్థితులు వచ్చాయి. ఆ మధ్య హైదరాబాదులో నేపాలి గ్యాంగ్ వరుస […]

YouTuber Rachna Gurjar: జేబుకు లేకుండా పర్స్ కొట్టేస్తున్న రోజులు ఇవి. ఒంటికి చెమట చుక్క పట్టకుండా సులువుగా డబ్బులు సంపాదించాలని భావిస్తున్న రోజులు కూడా ఇవే. స్థూలంగా చెప్పాలంటే సాటి మనిషిని మోసం చేయడానికి.. అడ్డగోలుగా దోచుకోవడానికి.. నిలువు దోపిడీ చేయడానికి ఏమాత్రం వెనకాడని రోజులు కూడా ఇవే. అందువల్లే జాగ్రత్తలే తీసుకోవడం మాత్రమే కాదు.. కొన్ని సందర్భాలలో మనల్ని మనం కూడా నమ్మకూడని పరిస్థితులు వచ్చాయి.

ఆ మధ్య హైదరాబాదులో నేపాలి గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడింది. భారీ ఎత్తున బంగారాన్ని.. నగదును దోచుకెళ్ళింది. విశ్రాంత ఉద్యోగుల గృహాలను టార్గెట్ చేసి ఈ దారుణాలకు పాల్పడింది. ఆ తర్వాత పోలీసుల రంగంలోకి దిగి వారందరినీ అరెస్ట్ చేశారు. బంగారాన్ని.. నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత నేపాల్ గ్యాంగ్లను ఎవరు కూడా పనిలో పెట్టుకోవడం లేదు. పోలీసులు కూడా నేపాలి దేశాన్ని చెందిన వారి మీద తీవ్రంగా దృష్టి సారించారు.. అయితే ఆ విశ్రాంతి ఉద్యోగులు నేపాలి పని మనుషులకు తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని చూపించడం వల్లే ఈ దారుణాలు జరిగాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇప్పుడు ఇటువంటి పరిస్థితే యూట్యూబ్ రచన గుర్జర్ కు ఎదురైంది. ఈమెకు సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువ. పైగా ప్రచారాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఇంట్లో ఉన్న నగలను మొత్తం చూపించింది. అది కాస్త ఆమెను చిక్కుల్లో పడేలా చేసింది. తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను మొత్తం వీడియో తీసి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో దొంగలు ఆమె బంగారం చూసి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా సరే దొంగిలించాలని భావించారు. తన ఇంట్లోకి వెళ్లి.. దర్జాగా బంగారాన్ని తస్కరించారు. దొంగలు తిరస్కరించిన బంగారం విలువ దాదాపు 6 లక్షల వరకు ఉంటుంది. అంతేకాదు, 1.91 లక్షల నగదు కూడా దొంగలు దోచుకెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఉన్న కూల్ డ్రింక్ కూడా తాగేసి పారిపోయారు.

ఇంట్లో ఉన్న బంగారు కనిపించకపోవడం.. నగదు లేకపోవడంతో రచన కన్నీరు మున్నీరు అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆమె ఇంట్లోకి వచ్చారు. ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ లను చూశారు. అందులో దొంగలు కూల్ డ్రింక్ తాగిన దృశ్యాలు.. బంగారాన్ని దోచుకుని పోతున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. సెలబ్రిటీలు అయినంతమాత్రాన సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదని.. అలా చేస్తే దొంగలు ఇలా దోచుకుపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper