Homeబిజినెస్Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్...

Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్ అవుతాయి..

Bike Mileage Tips: ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్తగా టూ వీలర్ కొనాలని అనుకునేవారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్పటికే వాహనాలు ఉన్నవారు వాటిని తీసేయకుండా కొన్ని టిప్స్ పాటిస్తే మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. బైక్ లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే అనుకున్న దానికంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. అందులో ప్రధానంగా ఈ 5 టిప్స్ పాటించడం వల్ల మీ డబ్బులు బాగా సేవ్ అవుతాయి. మరి ఆ 5 టిప్స్ ఏవో చూద్దాం..

1. టైర్ ప్రెషర్:
బైక్ మైలేజ్‌ బాగుండాలంటే టైర్ ప్రెషర్ చాలా ముఖ్యం. టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుతో టైర్ సంపర్కం ఎక్కువై రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో బైక్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇంజిన్ మరింత శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్ వినియోగం పెరిగి మైలేజ్ తగ్గుతుంది. అందువల్ల కనీసం వారానికి ఒకసారి లేదా సుదూర ప్రయాణానికి ముందు టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.

2. క్రమం తప్పకుండా సర్వీసింగ్:
చాలా మంది బైక్ కొన్నకొత్తలో బాగానే చూసుకుంటారు. కానీ ఆ తరువాత సర్వీసింగ్ గురించి పట్టించుకోరు. కానీ బైక్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిర్ణీత సమయంలో ఇంజిన్ ఆయిల్‌ను మార్చకపోవడం, ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉన్నా ఇంజిన్ సామర్థ్యం తగ్గవచ్చు కాబట్టి ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ క్రమం తప్పకుండా తనిఖీ చేయించాలి.

3. నిర్లక్ష్యంగా డ్రైవింగ్:
బైక్ నడిపే విధానం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచుగా ఒక్కసారిగా వేగాన్ని పెంచడం, హఠాత్తుగా బ్రేకులు వేయడం వంటి అలవాట్లు ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. ట్రాఫిక్‌లో అవసరం లేకుండా పదేపదే యాక్సిలరేటర్‌ను పెంచడం కూడా మైలేజ్ తగ్గడానికి కారణం కావచ్చు. సాధ్యమైనంత వరకు స్థిరమైన వేగంతో, స్మూత్‌గా బైక్ నడపడం మంచిది.

4. బైక్‌పై అనవసరమైన బరువు వద్దు:
బైక్‌పై ఎక్కువ బరువు ఉంటే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. ప్రతిరోజూ అవసరం లేని వస్తువులను బైక్‌లోని స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లేదా టాప్ బాక్స్‌లో కూడా ఉంచొద్దు. ఇలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరగవచ్చు. అందువల్ల ప్రయాణానికి అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.

5. నాణ్యమైన ఇంధన:
బైక్‌కు సరైన నాణ్యత కలిగిన ఇంధనం ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. నమ్మకమైన పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం తీసుకోవడం మంచిది. ఎక్కువ ఆక్టేన్ ఇంధనం పోస్తే ప్రతి బైక్‌లోనూ మైలేజ్ పెరుగుతుందనే అపోహ ఉంది. వాస్తవానికి బైక్ ఇంజిన్‌కు అవసరమైన ఇంధన రకాన్ని మాన్యువల్‌లో సూచిస్తారు. కాబట్టి అవసరం లేని ఖరీదైన ఇంధనాన్ని ఉపయోగించొద్దు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Jogi Rajeev

Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో వైరల్..

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు...
Pakistan Democracy

Pakistan Democracy: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగు.. – రాజ్యాంగ సవరణతో అధికారాలు పాక్ ఆర్మీ చీఫ్ కు..

Pakistan Democracy: పాకిస్తాన్‌ చరిత్రలో సైన్యం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇటీవలి రాజ్యాంగ సవరణలు, ముఖ్యంగా 27వ సవరణ, ఆ ఆధిపత్యాన్ని మరింత అధికారికం, కేంద్రీకృతం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు...

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Oktelugu Epaper