Homeబిజినెస్Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు దారులకు షాక్.. భారీగా జీఎస్టీ పెంపు

Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు దారులకు షాక్.. భారీగా జీఎస్టీ పెంపు

Second Hand Cars: కొత్త ఖరీదైన కారు కొనుగోలు చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది కొనుగోలు చేయలేరు. కానీ కారు అవసరం మాత్రం తప్పకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడానికి లేదా డ్రైవింగ్ వంటి పనుల కోసం కొందరు కారు తీసుకుంటారు. డబ్బులు ఉంటే తప్పకుండా కొత్త కారు కొనుగోలు చేస్తారు. డబ్బులు లేకే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల రాజస్థాన్ జైసల్మేర్‌లో జీఎస్టీ కౌన్సిల్ జరిగింది. ఈ జీఎస్టీ కౌన్సిలో‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత, సెకండ్ హ్యాండ్ కార్లపై జీఎస్టీ రేట్లు పెరగనున్నట్లు తెలిపింది. ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది కొత్త కార్లు కొనకుండా సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయాలని భావిస్తారు. కానీ కేంద్రం సెకండ్ కార్ల కొనుగోలుపై రేట్లు పెంచి.. ప్రజలపై భారం వేసింది. అయితే ఇది కేవలం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్న వారికే మాత్రమే వర్తిస్తుంది. అంటే మీరు ఆ వ్యాపారి దగ్గర కొనుగోలు చేస్తే మీకు జీఎస్టీ పడుతుంది. అదే మీరు వ్యక్తిగతంగా ఎవరి దగ్గర అయిన కొనుగోలు చేస్తే జీఎస్టీ వర్తించదని కేంద్ర తెలిపింది.

ఆటోక్లేవ్డ్ అయిరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్‌ 50 శాతం కంటే ఎక్కువగా యూజ్ చేస్తే వారికి కూడా జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వీరికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అలాగే ఆహార ఉత్పత్తుల కోసం వాడే ఇన్‌పుట్‌లకు 5 శాతం రాయితీ రేటు పొడిగిస్తారట. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణగ్రహీతల నుంచి పెనాల్టీ వసూలు చేస్తుంటారు. వారిపై ఎలాంటి జీఎస్టీ వర్తించదని కేంద్రమంత్రి తెలిపారు. అలాగే పాప్‌కార్న్, ఉప్పు, పంచదారకు వేర్వేరు రేట్లు నిర్ణయించారు. పాప్‌కార్న్, చక్కెరకు 18 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. అయితే సాల్ట్ అండ్ స్పైస్ సీజన్డ్ పాప్ కార్న్‌కు అయితే 5 శాతం జీఎస్టీ, ప్యాక్ చేసి లేబుల్‌తో ఉంటే జీఎస్టీ 12 శాతం వర్తిస్తుంది. అదే షుగర్ కోటెడ్ పాప్ కార్న్ అయితే మాత్రం తప్పకుండా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఇకపై పాప్‌ కార్న్ కూడా ఖరీదైనదే. వీటితో పాటు ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌కు జీఎస్టీ 5 శాతంగా ఉంటుందని, ఈ బియ్యం దేనికి ఉపయోగించిన కూడా పన్నులో రేటులో మార్పు ఉండదని తెలిపారు.

ఈ జీఎస్టీ సమావేశంలో మొత్తం 148 పదార్థాల రేట్లపై జీఎస్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు సమావేశంలో పొగాకు, దుస్తులపై జీఎస్టీ వేశారు. అంటే మీరు తీసుకునే దుస్తులు రూ.1500 ఉంటే 5 శాతం జీఎస్టీ, రూ.1500 నుంచి రూ.10000 ఉంటే 18 శాతం జీఎస్టీ, రూ.10000 కంటే ఎక్కువ ఉంటే 28 జీఎస్టీ రేట్లను నిర్ణయించారు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలా సామాన్య సౌకర్యాలపై జీఎస్టీ పెంచుతుంటే మధ్య తరగతి ప్రజలపైనే మళ్లీ భారం పడనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular