Homeబిజినెస్Samsung Galaxy S26 Ultra: ఈ Samsung ఫోన్ పై ఏకంగా రూ.25,000 తగ్గింపు.. వెంటనే...

Samsung Galaxy S26 Ultra: ఈ Samsung ఫోన్ పై ఏకంగా రూ.25,000 తగ్గింపు.. వెంటనే త్వరపడండి..

Samsung Galaxy S26 Ultra: ప్రముఖ మొబైల్ కంపెనీ Samsung ఫోన్లు అంటే చాలామంది లైక్ చేస్తారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో ఆకట్టుకునే మొబైల్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఇటీవల కొత్త కొత్త మొబైల్స్ అందుబాటులోకి రావడంతో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీంతో ఈ కంపెనీ తన సేల్స్ పెంచుకోవడానికి Samsung ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా ఈ కంపెనీకి చెందిన ఓ మొబైల్ పై ఏకంగా రూ.25,000 తగ్గింపు ధరతో ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు బ్యాంకు ఆఫర్లు కూడా తోడైతే మరింతగా తక్కువ ధరకే ఫోన్ వస్తుంది.. ఇంతకీ ఆ మొబైల్ ఏది? దానిపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

Samsung నుంచి త్వరలో మార్కెట్లోకి Galaxy S 26 Ultra అనే మొబైల్ రాబోతుంది. ఫిబ్రవరి 25 నుంచి దీనిని సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అందుబాటులో ఉన్న Samsung Galaxy s24 Ultra మొబైల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ఆఫర్లు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ మొబైల్ కు ఆదరణ ఉంది. అయినా కూడా దీని సేల్స్ పెంచడానికి కంపెనీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ మొబైల్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ డిస్ప్లే 6.8 అంగుళాలు ప్లాట్ డైనమిక్ AMOLED తో పని చేస్తుంది. 2600 నిట్స్ బ్రైట్నెస్ తో ఉండే ఈ మొబైల్లో మూవీస్ తో పాటు గేమింగ్ కోరుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్లు తెలుస్తుంది. నేటి తరం వారికి అనుకూలంగా ఉండే విధంగా రామ్ కెపాసిటీ కూడా పెంచారు. 12gb రామ్ తో పాటు 256 జీబీ నుంచి 1 TB వరకు స్టోరేజ్ పొందేందుకు అవకాశం ఉంది. దీంతో కావలసిన ఫోటోలు, వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్ వేగం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుత కాలంలో ప్రతి మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. వారికి అనుగుణంగా సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మొబైల్ లో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే 100 MP అల్ట్రా వైడ్ కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా కూడా ఉండడంతో వీడియో కాలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ ఉండడంతో రోజువారి వినియోగదారులకు మొబైల్ ఛార్జింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Samsung Galaxy s24 Ultra మొబైల్ ను ఫిబ్రవరి 25 నుంచి రూ.25,000 తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్లో రూ. 1,19,999 తో విక్రయిస్తున్నారు. అయితే కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కూడా మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అమెజాన్ సంస్థలో ఈ ఆఫర్ వర్తించే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular