Gold, Silver Rate Today: ప్రపంచంలో ప్రస్తతం ఏం నడుస్తోంది అంటే.. బంగారం, వెండి ధరల పెరుగుదల నడుస్తోందని చెబుతున్నారు. ఏడాది క్రితం మొదలైన ఈ పెరుగుదల ప్రయాణం.. ఇంకా కొనసాగుతోంది. అప్పుడప్పుడు చిన్నచిన్న బ్రేక్లు పడుతున్నా.. పెరుగుదల మాత్రం ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు గొల్డ్, సిల్వర్ నిల్వలు పెంచుకుంటున్నాయి. దీంతోపాటు యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల బ్యాంకులు గోల్డ్, సిల్వర్ నిల్వలు పెంచుకుంటున్నాయి. దీంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ధరల పెరుగుదల ఇలా..
తాజాగా బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు రూ.2,070 పెరిగి రూ.1,61,350కు చేరింది. దీంతో ఇక సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం, వెండి కొనే పరిస్థితి లేదు. 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర రూ.1,900 పెరిగి రూ.1,47,900గా నిలిచింది. కేజీ వెండి ధర కూడా రూ.10 వేలు పెరిగింది. దీంతో రూ.3 లక్షలకు చేరింది. ఈ హెచ్చుతగ్గులు మార్కెట్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనత, భౌగోళిక ఉద్రిక్తతలు, పన్నుల పెరుగుదలకు ప్రధాన కారణాలు. భారతదేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు మరింత పెరిగాయి. దీనికి ఇన్ఫ్లేషన్, కరెన్సీ బలహీనతలు కూడా తోడయ్యాయి.
ఈ ధరలు బంగారం, వెండిని సామాన్యులకు దూరం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాలు పొందుతున్నారు. కొత్తగా కొనుగోళ్లు నిలిపి, ధరలు స్థిరపడనంతవరకు ఎదురుచూడటం మంచిది. మార్కెట్ ట్రెండ్లను ట్రాక్ చేసి, వైవిధ్య పెట్టుబడులు పెట్టడితే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.