spot_img
Homeబిజినెస్Coca-Cola packaging change: కోకా–కొలా సోడా సరికొత్త ప్యాకేజింగ్‌.. బ్రాండ్లలో భారీ మార్పు..

Coca-Cola packaging change: కోకా–కొలా సోడా సరికొత్త ప్యాకేజింగ్‌.. బ్రాండ్లలో భారీ మార్పు..

Coca-Cola packaging change: కోకా–కొలా అందరికీ సుపరిచితమైన అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ. దశాబ్దాలుగా ప్రజలకు నమ్మకమైన కూల్‌ డ్రింక్స్‌ అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా లాబాలు ఆర్జిస్తోంది. తాజాగా ఈ సంస్థ సైలెంట్‌గా ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ను మార్పు చేసింది. ఆస్ట్రియాలో కోకా–కొలా హెచ్‌బిసి, డీఎస్‌ స్మిత్, క్రోన్స్‌ భాగస్వామ్యంతో 1.5 లీటర్ల సిక్స్‌ ప్యాక్‌ బాటిల్స్‌ కోసం కారడ్బర్డ్, రీసైక్లబుల్‌ పేపర్‌ హ్యాండిల్స్, పేపర్‌ ర్యాప్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్యాకేజింగ్‌తో వార్షికంగా 220 టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. అయితే, ఈ మార్పు ఇప్పటికీ అమెరికాలో అందుబాటులో లేదు.

పర్యావరణ నాణ్యతపై విమర్శలు..
గ్రీన్‌పీస్‌ అఫ్రికా ప్రాజెక్ట్‌ నిర్వాహకురాలు హెలెన్‌ కహాసో డెనా కోకా–కొలన పర్యావరణ బాధ్యతపై సందేహం వ్యక్తం చేశారు. సంస్థ సింగిల్‌–యూజ్‌ ప్లాస్టిక్‌ మీద ఆధారపడటం మానివ్వాలని, పునర్వినియోగ వ్యూహాలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఓషియానా సంస్థ కూడా కోకా–కొలాల ప్లాస్టిక్‌ వాడకం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని నిర్లక్ష్యంగా, అవసరమేనట్టుగా పేర్కొంది.

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు..
కోకా–కొలా 2024లో తీసుకున్న కొత్త విధానంలో పరిశుద్ధ ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ శాతం 30% నుంచి 35%గా పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మార్కెట్‌లో విడుదలయ్యే సీసాలు, క్యాన్ల సేకరణ శాతాన్ని 70% నుంచి 75% వరకూ పెంచేందుకు ప్రణాళికలు ఉన్నాయి. కానీ, పరిశ్రమ నిపుణులని దృష్ట్యా ఇవి మొత్తం ప్లాస్టిక్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించలేవు.

అతిపెద్ద ప్లాస్టిక్‌ కాలుష్యం ఉత్పత్తిదారు
గత ఆరు సంవత్సరాలుగా వరుసగా కోకా–కొలా ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్‌ కాలుషకుడిగా గుర్తించబడింది. వార్షికంగా 100 బిలియన్‌ సింగిల్‌–యూజ్‌ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ విక్రయిస్తూ ఈ ప్లాస్టిక్‌ చాలా భాగం సముద్రాలు, నేలలను కలుషితం చేస్తున్నది. 2030 వరకు ఈ వ్యర్థాలు మించి పెరుగనున్నాయని ఓషియానా అంచనా.

కోకా–కొలా పర్యావరణ విధాన తీర్మానం
కోకా–కొలా సంస్థ ‘వాటర్‌ స్టెవరడ్షప్,‘ ‘క్లైమేట్‌ ప్రొటెక్షన్,‘ ‘సస్టైనబుల్‌ ప్యాకేజింగ్,‘ ‘సస్టైనబుల్‌ సోర్సింగ్‌‘ వంటి నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టి మౌలిక దౌత్యాలు ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ, కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు, ప్యాకేజింగ్‌ రీసైక్లింగ్‌ అభివద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.

సైన్స్‌ జర్నల్‌ Nature.com నివేదిక ప్రకారం, కోకా–కొలా, పెప్సీ, నెట్ట్లే వంటి ప్రముఖ బేవరేజ్‌ కంపెనీలు 2000–2023 మధ్య 138 మిలియన్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి చేశాయి. వీటిలో కేవలం 8–11 శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అయ్యాయి, మిగిలినది సముద్రాలు, భూమి కాలుష్యానికి కారణమైంది. కంపెనీల ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్‌ దుష్ప్రభావాల వ్యయాన్ని ప్రపంచ దేశాలు భరిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper