ఐదురోజుల పాటు సాగే ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేవాశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రముఖుల మ్రుతికి సంతాపం తెలిపిన సభ ఆ తరువాత సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదనలు హాట్ హాట్ గా సాగాయి. స్పీకర్ పోడియం ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు బైఠాయించి నిరసన తెలిపారు. తుఫాను పంట నష్టంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరపాలని పట్టుబట్టారు. పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను పక్కదోవ పట్టించడానికి టీడీపీ నాయకులు చూస్తున్నారని విమర్శించారు. అయితే చివరగా సభ్యుల ప్రవర్తన బాగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tdp members suspended in ap assembly meetings
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com