కృష్ణ జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత కుమారుడిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నం మార్కెట్యార్డు చైర్మన్గా ఉన్న అచ్చాబా కుమారుడు ఖాదర్భాషా ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా కాలిన గాయాలతో అరుపులు పెట్టసాగాడు. అయితే ఎవరైనా నిప్పు పెట్టారా..? లేక వేరే కారణమా..? తెలియాల్సి ఉంది. బాధితుడిని చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అయితే ఖాదర్భాష భార్యపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.