ఏలూరు ప్రజలకు ప్రభుత్వం మరింత అండగా ఉండాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. రేపు ఏలూరుకు జనసేన తరఫున డాక్టర్ల బృందం పంపనున్నట్లు తెలిపారు. ‘ఏలూరులో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ముగ్గురు వైద్య నిపుణులతో ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. పార్టీ పీఏసీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు. బృందంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ ఎమ్.వెంకటరమణ సభ్యులుగా ఉంటారని తెలిపారు.