కూరగాయల వ్యాపారులు, తోపుడు బండ్లు నడిపే వారికి ఉపయోగపడే ‘జగనన్న తోడు’ పథకాన్ని బుధవారం ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ రంగంలోని లబ్ధిదారులకు రూ. 10 వేల రుణ సదుపాయం కల్పించనున్నారు. అలాగే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించనున్నారు. రూ.905 కోట్ల మేర వడ్డీ లేని రుణాలను వీరికి అందించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ పథకాంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటూ ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మీ పేరు ఉందో చూసుకోండని, లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న రెండు నెలల లోపే వీరికి రుణ సాయం అందుతున్నారు.