దాదాపు పదేళ్ల కిందట మూతబడ్డ విజయవాడలోని బాపు మ్యూజియాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ మ్యూజియం నిర్మాణానికి 80 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్రం నిధులు వెచ్చించింది. పురాతన వస్తువుల వివరాలు తెలుసుకునేందుకు సందర్శకులకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఈ మ్యూజియంలో మహాత్మగాంధీ విగ్రహాలతో పాటు జైన, బుద్ధ, హిందూ విగ్రహాలు, రాజుల కాలంలో వాడిన కత్తులు ఉంచారు. ఈ మ్యూజియానికి ఎంతో ప్రత్యేకత ఉందని జగన్మోహన్రెడ్డి అన్నారు.
Also Read: దుర్గగుడిలో మరో అపచారం..