
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 534 మందికి కొవిడ్ నిర్ధారణ కాగా.. ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,77,348కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్ బారినపడి 7,069 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 498 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,65,825కి చేరింది.