Homeఆంధ్రప్రదేశ్‌TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన ఈ టిడిపి నేత పార్టీతో పాటు నాయకత్వానికి చాలా విధేయత గా ఉంటారు. అయితే ఇటీవల టిడిపి నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన మంత్రి పదవి ఇవ్వకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కాపు అంశంపై మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను ఆకాశానికి తీశారు. ఆయనను తేలిగ్గా తీసుకోవడం వల్లే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు కామెంట్స్ పై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మంత్రి పదవి రాకపోవడంతో..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు బోండా ఉమామహేశ్వరరావు. కాపుల కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే వివిధ సమీకరణలో అది వీలు కాలేదు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు మాత్రం పార్టీతో పాటు నాయకత్వంపై విధేయతతోనే వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి, కాపుల అంశం వంటి వాటిపై బాహటంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ముద్రగడ పద్మనాభం సేవలను కొనియాడడమే కాదు.. ఆయనను టిడిపి నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. పార్టీని ఇరకాటంలో పెట్టేలా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతుండడంపై మాత్రం కూటమి పార్టీలో కొత్త చర్చ నడుస్తోంది.

వైసీపీ నేతలతో..
గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సైతం ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు. త్వరలో కాపుల ఆత్మీయ సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ విషయంలో బోండా ఉమామహేశ్వరరావు కు చెడిందా? అనే అనుమానం కలుగుతోంది. అయితే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ లైన్ దాటి ఎక్కడా వ్యవహరించలేదని టిడిపిలోనే ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే టిడిపిలో ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు కామెంట్స్ పెద్ద కలకలమే సృష్టిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
Oktelugu Epaper