Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy family silence: పెద్దిరెడ్డి ఫ్యామిలీ సైలెన్స్.. ఏంటి కథ?!

Peddireddy family silence: పెద్దిరెడ్డి ఫ్యామిలీ సైలెన్స్.. ఏంటి కథ?!

Peddireddy family silence: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు తెగ బాధపడుతున్నారట. రెండేళ్లు అవుతున్న జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో వారు పునరాలోచనలో పడ్డారట. ఇక జగన్ తో నడిస్తే తమకు నష్టం అన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే వీలైనంత త్వరగా పార్టీ నుంచి బయట పడాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నంలోనే ఉంది. కానీ జగన్ వెళ్తున్న మార్గం మాత్రం సీనియర్లకు అంతు పట్టడం లేదు. ఆది […]

Peddireddy family silence: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు తెగ బాధపడుతున్నారట. రెండేళ్లు అవుతున్న జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో వారు పునరాలోచనలో పడ్డారట. ఇక జగన్ తో నడిస్తే తమకు నష్టం అన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే వీలైనంత త్వరగా పార్టీ నుంచి బయట పడాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నంలోనే ఉంది. కానీ జగన్ వెళ్తున్న మార్గం మాత్రం సీనియర్లకు అంతు పట్టడం లేదు. ఆది నుంచి అదే మార్గంలో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెప్పి ఏకంగా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. చంద్రబాబు మాదిరిగా సభకు వెళ్లి.. ఆయన భావిస్తున్నట్టుగా అవమానాలు ఎదురైతే.. అప్పుడు బయటకు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వినిపించారు సీనియర్లు. కానీ దానిని తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి. అయితే సీనియర్ల మాటలు అస్సలు వినడం లేదు. ఇలా అయితే పుంజుకోవడం కష్టమన్న భావనకు సీనియర్లు వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మంచి దూరంగా వెళ్లాలని భావిస్తున్నారు. అటువంటి నేతల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న నేతలు సైతం ఉండడం విశేషం.

పెద్దగా యాక్టివ్ లే..
గత కొంతకాలంగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా బయటకు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వంపై ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. ఎంతవరకు ఆయన తన సొంత పనులకు పరిమితం అవుతున్నారు. ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సైతం అలానే వ్యవహరిస్తున్నారు. జగన్ వెంట అడుగులు వేయడం ద్వారా ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ అని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకునేవారు. పెద్దగా శత్రుత్వం కూడా లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా పెద్దిరెడ్డికి శత్రువులు తయారయ్యారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బాధ్యతలు కట్టబెడితే… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదేళ్లపాటు బాగానే శ్రమించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్ గా ఇబ్బందులు పడుతోంది. రాజకీయంగా గౌరవం కూడా తగ్గింది. పోనీ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాలు ఇస్తే ఆయన పాటించడం లేదు. అందుకే ఆయన వద్ద ఉండటం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడం వ్యూహాత్మకంగా సైలెంట్ పాటిస్తోంది.

కేసుల బాధ..
గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ. 2014లో టిడిపి అధికారంలో వచ్చిన సమయంలో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ యాక్టివ్గానే పని చేసింది. 2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉండడంతో.. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు తమ మెడకు చుట్టుకున్నాయన్న బాధ పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఉంది. పైగా అవినీతి ఆరోపణలు రావడంతో ప్రజల విశ్వాసం కూడా తగ్గింది వారి పట్ల. అందుకే వైసీపీలో ఉంటే తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వారు భావించినట్టు ఉన్నారు. పైగా మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి నిందితుడు కూడా. అయితే ఈ కుంభకోణంలో వచ్చిన ప్రయోజనం తక్కువ.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి నిశ్చింతగా ఉన్నారు. తమకు మాత్రం ఇబ్బందులు అన్నది పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఉన్న బాధ. అలాగని ఎప్పటికీ ఇప్పుడు పార్టీని విడిచి పెడితే క్రెడిబిలిటీ తగ్గుతుంది అన్న భయం కూడా ఉంది. అందుకే సమయం కోసం చూస్తున్నారు. అప్పటివరకు పార్టీలో కొనసాగుతున్న సైలెన్స్ పాటిస్తారన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper