Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: రాజకీయాల రంగు వీడి... అక్షర కాంతులు మెరిసి: విద్యావ్యవస్థలో నారా లోకేష్ 'నిజాయితీ'...

Nara Lokesh: రాజకీయాల రంగు వీడి… అక్షర కాంతులు మెరిసి: విద్యావ్యవస్థలో నారా లోకేష్ ‘నిజాయితీ’ విప్లవం!

Nara Lokesh: ప్రతి రాజకీయ పార్టీకి ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది. కానీ విధానపరంగా వెళ్లే క్రమంలో రాజకీయాలు అలుముకుంటాయి. ఒకవైపు ప్రభుత్వ పాలన నడిపిస్తూనే రాజకీయాలు చేస్తేనే పార్టీలు మన గలవు. ప్రభుత్వపరంగా ఏ చిన్న మార్పు కోసం ప్రయత్నం చేసినా.. దాని వెనుక రాజకీయాలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. అయితే రాజకీయాలను పక్కనపెట్టి విద్యావ్యవస్థను సమూల మార్పులు తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ భావించారు. ఇందుకు గట్టిగానే అడుగులు వేశారు. వాటికి సంబంధించిన సత్ఫలితాలు వచ్చాయి. పాఠశాల విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటివరకు పత్రిక ప్రకటనలకు కేవలం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు మాత్రమే పరిమితం అయ్యాయి. తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను పత్రికల యాడ్ల రూపంలో ప్రచురించారు అంటే.. ప్రభుత్వ విద్య విషయంలో నారా లోకేష్ ఆలోచన ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతుంది.

Nara Lokesh
Nara Lokesh

* మారుతున్న కాలానికి అనుగుణంగా..
మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలి అంటే.. కచ్చితంగా మెరుగైన విద్యా బోధన ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా మారాలి. ఇదే ఆకాంక్షను పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ బయటపెట్టారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా వరకు పాఠ్యాంశాల పునర్నిర్మాణం చేపట్టారు. క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్ వంటి గేమ్ చేంజర్ రంగాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా లోకేష్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. ఒక విజయంతో పనిచేసి ఎన్సీఈఆర్టీ, ఐఐటి మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో సరికొత్త కోర్సులను కూడా రూపొందించారు.

* యూనివర్సిటీల్లో మార్పులు
ఒక్క ప్రాథమిక, ఉన్నత విద్య విషయంలో మాత్రమే కాదు.. యూనివర్సిటీల విషయంలో సైతం లోకేష్ ప్రత్యేక ఆలోచనలతో ముందుకు సాగారు. యూనివర్సిటీలు అనేవి కేవలం పరీక్షలు నిర్వహించే కేంద్రాలుగా ఉండకూడదు అనేది ఆయన భావన. సరికొత్త ఆవిష్కరణలకు నిలయంగా మారాలని భావిస్తున్నారు. ప్రతి యూనివర్సిటీని ఒక పారిశ్రామిక సంస్థతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల్లో అనుభవం లభిస్తుంది అని భావించారు. అందుకే ప్రపంచంలోనే టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని లక్ష్యం ఆయనలో కనిపించింది. ఎంతలా అంటే నర్సింగ్, పాలిటెక్నిక్ డిప్లమో వంటివి పూర్తి చేసిన విద్యార్థులకు ఏకంగా జర్మన్, రష్యా వంటి భాష లను నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు లభించే స్థాయికి వారిని తీర్చిదిద్దుతున్నారు అంటే లోకేష్ ఆలోచన ఇట్టే అర్థం అవుతుంది.

* అన్ని అంశాల్లో మార్పు..
పాఠశాల విద్యాశాఖ స్వరూపాన్ని మార్చారు. విద్యా బోధనను మార్చారు. పాఠ్యాంశాలను మార్చారు. అంతటితో ఆగలేదు ఆయన ప్రయత్నం. మధ్యాహ్నం భోజనం లో సమూల మార్పులు తీసుకొచ్చారు. పోషకాలతో కూడిన మెనూ, కిచెన్ గార్డెన్లు, డిజిటల్ బోధన ద్వారా పాఠశాల విద్యను మరింత బలోపేతం చేశారు. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండడం.. మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి చిన్న అంశాలనుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి పెద్ద అంశాల వరకు.. అన్ని నారా లోకేష్ ఆలోచనలే. వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వాటిని గాడిలో పెట్టే పనిలో లోకేష్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను సైతం పత్రికలకు యాడ్ల రూపంలో ఇచ్చారు అంటే.. ప్రభుత్వ విద్యను ఏ స్థాయిలో నిలబెట్టారు అనేది ఇట్టే అర్థమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper