Amravati Central Secretariat Project: అమరావతికి ( Amravati capital ) వరుస శుభవార్తలే. ఎప్పటికీ అమరావతికి చట్టబద్ధతతో కేంద్రం రక్షణ కవచంగా నిలిచింది. అమరావతి గడ్డపై తన ముద్రను బలంగా చాటుతోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ బయట కేంద్ర ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ కోసం భారీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇది నిజంగా అమరావతికి గుడ్ న్యూస్. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత కల్పించడమే కాదు.. తోడుగా నిలవాలని కేంద్రం నిర్ణయించుకోవడం మాత్రం శుభపరిణామం. సుమారు రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా.. అమరావతిలో కేంద్ర సంస్థలన్నీ ఒకే చోటకు రానున్నాయి. అంటే ఇక కేంద్ర కార్యకలాపాలు కూడా అమరావతి నుంచి ప్రారంభం కానున్నాయి అన్నమాట. చట్టబద్ధతతో పూర్తి రక్షణ కల్పించిన కేంద్రం.. ఇప్పుడు నేరుగా రాజధానిలో కేంద్ర సమూహాలన్నీ ఒకే చోట చేర్చడం మాత్రం గొప్ప విషయం.
* రెండు విభాగాలుగా నిర్మాణం…
కేంద్ర ప్రభుత్వం( central government) అమరావతిలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టును రెండు విభాగాలుగా విభజించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల కార్యాలయాల కోసం రూ.1299 కోట్లు కేటాయించగా.. అక్కడ పనిచేసే ఉద్యోగుల నివాస వసతుల కోసం మరో రూ.1234.91 కోట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతా అభివృద్ధి ప్రాధికార సంస్థ ( crda) 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో పాలనా సౌధం కోసం ఏకంగా 5.53 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 17 ఎకరాల్లో అత్యాధునిక బహుళ అంతస్తుల నివాస సముదాయాలు నిర్మించనున్నారు.
* అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్..
మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా Hudco ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో ఒక అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మించనున్నారు. ప్రపంచ స్థాయి సదస్సులు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ నిర్వహించుకునేలా దీనిని రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలోకి రానుండడం అమరావతికి కొత్త శోభ రానుంది. దేశ రాజధాని ఢిల్లీ బయట ఒక మోడ్రన్ పవర్ సెంటర్ గా అమరావతిని నిలబెట్టాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది.