spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Social influencer Abbayi Kanth: నిండుగా చెత్త.. మెండుగా నిర్లక్ష్యం.. అతడి దృష్టిపడింది..ఆ పురాతన మెట్ల...

Social influencer Abbayi Kanth: నిండుగా చెత్త.. మెండుగా నిర్లక్ష్యం.. అతడి దృష్టిపడింది..ఆ పురాతన మెట్ల బావి ఇప్పుడు ఎలా ఉందంటే?

Social influencer Abbayi Kanth: అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. అవి జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇతడు చేసిన పని కూడా అటువంటిదే. అతడికి అంగ అంగ బలం లేదు. అర్థ బలం అంతకంటే లేదు. పైగా సామాన్యుడు. తన వల్ల ఏమవుతుందను కోలేదు. తను మాత్రమే ఏం చేస్తానని భావించలేదు. ఒక్కడిగా అడుగు వేశాడు.. తనలాంటి అడుగులను జత చేశాడు. అంతేకాదు చూస్తుండగానే అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత ఎవరు వస్తారని ఎదురు చూడక.. నీ వంతు పిడికిలి బిగించు.. అనే మాటను చేతుల్లో చూపించాడు.

అది పురాతన మెట్ల బావి.. దానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు గొప్పగా విలసిల్లిన ఆ బావి ఆ తర్వాత కాలక్రమంలో చెత్తతో నిండిపోయింది. మురుగునీటి కేంద్రంగా మారిపోయింది. ఘనమైన చరిత్రకు ఆలవాలంగా నిలిచిన ఆ పురాతన మెట్ల బావి చివరికి డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది. ఆ బావి అలా ఉండడం కాంత్ అనే యువకుడికి నచ్చలేదు. పైగా ఘన వారసత్వం ఇలా మారిపోవడం అతడిని ఆలోచింపజేసింది. చెత్తతో నిండిపోయిన ఆ పురాతన బాగు చేసుకుందామని.. పూర్వ వైభవం తీసుకొద్దామని కాంత్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశాడు. బావి దీనత్వాన్ని సూచించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అతడు పెట్టిన పోస్ట్ చాలామందిని కదిలించింది. ఒక్కొక్కరుగా 300 మంది ముందుకు వచ్చారు. పూర్వ సంపద రక్షక సేన పేరుతో ఒక సంస్థగా ఏర్పడ్డారు. 300 మంది స్వచ్ఛంద సేవకులు పురాతన బావి ఉద్ధరణకు నడుము బిగించారు. చేతి తొడుగులు.. పనిముట్లు.. ఇతరత్రా యంత్రాలతో అక్కడికి వచ్చారు. అందరూ కలిసి బావిలో పేరుకుపోయిన చెత్తను బయటకు తీశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మొత్తంగా ఆ బావికి పూర్వ రూపాన్ని తీసుకొచ్చారు. ఫలితంగా ఇప్పుడు ఆ బావి కొత్తగా కనిపిస్తోంది. మెట్ల నుంచి మొదలుపెడితే లోపల నీరు వరకు ప్రతిదీ కూడా స్వచ్ఛంగా దర్శనమిస్తోంది.

అన్నట్టు ఈ బావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీపులి మండలంలో ఉంది. ఈ బావిని పునరుద్ధరించడానికి చాలా రోజుల సమయం పట్టింది. అన్ని రోజులు కూడా వారంతా తీవ్రంగా పనిచేశారు. మండే ఎండను లెక్క చేయలేదు. ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు బావి పునరుద్ధరణలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం తోడ్పాటు లేకుండా.. దాతల సహకారం లేకుండానే ఇంతటి యజ్ఞాన్ని నిర్వహించడం గొప్పగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ పని చేసిన కాంత్.. అతని బృందాన్ని అభినందిస్తున్నారు.

తొలి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. ఆ తర్వాత దాని జతగా పడే అడుగులు కొత్తదారిని చూపిస్తుంటాయి. సరికొత్త దిశగా ప్రయాణం సాగిస్తుంటాయి. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ అడుగులు ఆగవు. ఎందుకంటే తొలి అడుగు బలంగా ఉన్నప్పుడు.. మిగతా అడుగులు అంతకంటే బలంగా ఉంటాయి. దానిని నిరూపించాడు కాంత్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper