Homeఅంతర్జాతీయంUS Sanctions: ఇరాన్‌తో వ్యాపారం.. నాలుగు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు!

US Sanctions: ఇరాన్‌తో వ్యాపారం.. నాలుగు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు!

US Sanctions: అమెరికా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఆ దేశంలో వ్యాపారం చేసే సంస్థలపై టారిఫ్‌లు విధిస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే ఆక్షంలు అమలు మొదలైంది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఇవి ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాయి. మొత్తం సుమారు 119 మిలియన్‌ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని యుఎస్‌ పేర్కొంది. ఈ చర్య ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌ అనే విస్తృత క్యాంపెయిన్‌లో […]

US Sanctions: అమెరికా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఆ దేశంలో వ్యాపారం చేసే సంస్థలపై టారిఫ్‌లు విధిస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే ఆక్షంలు అమలు మొదలైంది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఇవి ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాయి. మొత్తం సుమారు 119 మిలియన్‌ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని యుఎస్‌ పేర్కొంది. ఈ చర్య ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌ అనే విస్తృత క్యాంపెయిన్‌లో భాగం.

ఈ కంపెనీలపై ఆంక్షలు..
యుఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకారం.. సదాశివ ఓవర్‌సీస్‌ లిమిటెడ్‌ ఇరాన్‌ నుంచి సుమారు 69 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. పీపీ సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సుమారు 25 మిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు. దీని డైరెక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌పై కూడా ఆంక్షలు విధించింది. ప్రకృతీస్‌ ఇన్‌ఫ్రా ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సుమారు 25 మిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటుంది. పోర్ట్‌ఈజ్‌ పార్ట్‌నర్స్‌ ఎల్‌ఎల్‌పీ కస్టమ్స్‌ బ్రోకర్‌గా ఇరానియన్‌ పెట్రోకెమికల్‌ షిప్‌మెంట్‌లను సులభతరం చేసింది. దీని భాగస్వాములు ఇంద్రిస్మియా అష్రఫ్‌మియా షేక్, హరిష్‌ రామచంద్ర రంగిపై కూడా ఆంక్షలు విధించింది. ఈ కంపెనీలు ఇరాన్‌ నుంచి పెట్రోలియం/పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల కొనుగోలు, రవాణా లేదా మార్కెటింగ్‌లో తెలిసి పాల్గొన్నాయని యుఎస్‌ ఆరోపించింది. కొన్ని షిప్‌మెంట్‌లు ఇప్పటికే ఆంక్షల్లో ఉన్న ఎంటీటీలతో అనుసంధానమయ్యాయని పేర్కొంది.

ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌ అంటే..
ఇది ఇరాన్‌ ఆదాయ వనరులను ముఖ్యంగా ఆయిల్, పెట్రోకెమికల్స్‌ కత్తిరించేందుకు యుఎస్‌ ప్రారంభించిన కొత్త క్యాంపెయిన్‌. ఇరాన్‌తో వ్యాపారం చేసే విదేశీ కంపెనీలు, మధ్యవర్తులు, షిప్పింగ్‌ సంస్థలపై సెకండరీ ఆంక్షలు విధించడం దీని లక్ష్యం. యుఎస్‌ ట్రెజరీ సెక్రటరీ ఇది ఇరాన్‌ ఆర్థిక సంబంధాలను గట్టిగా బిగించే చర్యగా వర్ణించారు. ఇరాన్‌పై యుఎస్‌ ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు వచ్చాయి.

భారత్‌పై ప్రభావం..
భారత్‌ అధికారికంగా ఇరాన్‌ నుంచి ఆయిల్‌ దిగుమతులను గతంలో తగ్గించింది. అయితే ప్రైవేట్‌ కంపెనీలు లేదా మధ్యవర్తుల ద్వారా కొన్ని లావాదేవీలు కొనసాగినట్లు యుఎస్‌ ఆరోపిస్తోంది. సంబంధిత కంపెనీల ఆస్తులు, యుఎస్‌ వ్యవస్థలో లావాదేవీలు బ్లాక్‌ కావచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్, షిప్పింగ్‌ సౌకర్యాలపై ప్రభావం పడవచ్చు. ఇతర భారతీయ కంపెనీలకు హెచ్చరికగా పనిచేస్తుంది. ఇరాన్‌తో వ్యాపారం చేస్తే సెకండరీ ఆంక్షల ప్రమాదం ఉంది. భారత్‌–ఇరాన్‌ సంబంధాలు చారిత్రకంగా ఉన్నాయి (చాబహార్‌ పోర్ట్, ఇతర ప్రాజెక్టులు). అయితే యుఎస్‌ ఆంక్షలు భారతీయ కంపెనీలను జాగ్రత్తగా ఉండమని గుర్తు చేస్తున్నాయి. భారత్‌ సాధారణంగా ఇటువంటి వ్యక్తిగత కంపెనీల ఆంక్షలపై ప్రత్యక్ష ప్రతిస్పందన ఇవ్వకుండా, తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తుంది.

ఇరాన్‌పై యుఎస్‌ ఆంక్షలు కొత్తవి కావు. కానీ ఇప్పుడు మూడవ దేశాల కంపెనీలపై దృష్టి పెట్టడం సెకండరీ ఆంక్షలు బలోపేతం చేస్తోంది. ఇది గ్లోబల్‌ ఆయిల్‌ ట్రేడ్, షాడో ఫ్లీట్‌లు, మధ్యవర్తులపై ఒత్తిడిని పెంచుతుంది. భారత్‌ వంటి దేశాలకు ఇది సవాల్‌. వాణిజ్య విధానాలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఇది గుర్తు చేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper