spot_img
Homeఅంతర్జాతీయంAnother danger for Pakistan: ఉగ్ర సంస్థకు వైమానిక దళం.. పాకిస్తాన్‌కు మరో ప్రమాదం..!

Another danger for Pakistan: ఉగ్ర సంస్థకు వైమానిక దళం.. పాకిస్తాన్‌కు మరో ప్రమాదం..!

Another danger for Pakistan: భారత్‌కు నష్టం కలిగించడమే లక్ష్యంగా దశాబ్దాలుగా పనిచేస్తున్న దేశం పాకిస్తాన్‌. మన దయతో ఏర్పడిన ఆ దేశం.. ఇప్పుడు మనకే ఇబ్బందిగా మారింది. మన కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థలే ముప్పుగా మారుతున్నాయి. ఇంతకాలం ఆఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లతో సత్సవంబంధాలు నెరపిన పాక్‌.. ఇప్పుడు తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ)తో ఇబ్బందులు పడుతోంది. టీటీపీని నాశనం చేయడానికి ఆఫ్గాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. ఇటీవల వరుస దాడులతో ఆఫ్గానిస్తాన్‌లో సామాన్యులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీటీపీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సలీం హక్కానీ నేతృత్వంలో ఈ యూనిట్‌ పాక్‌ సైన్యానికి పోటీగా పనిచేయనుంది. కశ్మీర్, గిల్గిట్‌–బాల్టిస్తాన్‌తోపాటు ప్రావిన్స్‌లను లక్ష్యంగా చేసుకుని, మిలిటరీ కమాండర్లతో పర్యవేక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక.

2022 ఒప్పందం రద్దు..
2022 నవంబరులో పాక్‌ ప్రభుత్వంతో చేసిన శాంతి ఒప్పందాన్ని టీటీపీ ఏకపక్షంగా ఉపసంహరించింది. ఆ తర్వాత ఖైబర్‌ పక్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో భద్రతా దళాలపై వరుస దాడులు చేపట్టింది. అఫ్గానిస్తాన్‌ నుంచి నడిచే ఈ ఉగ్రవాదులు పోలీసులు, అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అఫ్గాన్‌ తాలిబాన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి. పాక్‌ అధికారులు అఫ్గాన్‌ భూభాగం నుంచి దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే తాలిబాన్‌ ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రకటనలు పాక్‌ అధికారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.

నాయకత్వ మార్పులు..
మిలిటరీ యూనిట్లలో కొత్త నాయకుల నియామకాలు, ప్రావిన్స్‌ వారీగా బలోపేతం చేస్తోంది. ఈ వ్యూహం పాక్‌ సైన్యానికి గట్టి సవాలుగా మారనుంది. టీటీపీ బలహీనతలను పరిమితం చేసి, స్థిరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది.

పాకిస్తాన్‌ భద్రతకు ముప్పు..
ఇప్పటికే టీటీపీ వైమానిక దళం లేకపోయినా పాకిస్తాన్‌ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇటీవల టీటీపీ పాకిస్తాన్‌కు చెందిన 90 మంది సైనికులను బంధీగా పట్టుకున్నారు. వైమానిక దళం లేకపోవడం ఇంతకాలం బలహీనతగా మారింది. కానీ ఇప్పుడు అది కూడా ఏర్పాటు చేయబోతోంది. దీంతో అఫ్గాన్‌–పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను గమనిస్తోంది. పాక్‌ ప్రభుత్వం కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper