Homeట్రెండింగ్ న్యూస్Women Fight In Train: చూస్తుండగానే కొట్టుకున్నారు.. వామ్మో రైలును ఇలా చేపలదుకాణంగా మార్చేశారు

Women Fight In Train: చూస్తుండగానే కొట్టుకున్నారు.. వామ్మో రైలును ఇలా చేపలదుకాణంగా మార్చేశారు

Women Fight In Train: అాది ఓ రైలు..ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కూర్చోడానికి స్థలం కూడా లేదు. కానీ ఇంతలోనే ఓ మహిళ వచ్చింది. సీట్లో కూర్చున్న ఓ యువతిని లాగి పడేసింది. అదే పనిగా ఆమెపై దాడికి దిగింది. దీంతో మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా భీతిల్లారు. వామ్మో అంటూ భయపడ్డారు. ఈసంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గాని.. సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా వీడియోలు తెగ దర్శనమిస్తున్నాయి. […]

Women Fight In Train: అాది ఓ రైలు..ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కూర్చోడానికి స్థలం కూడా లేదు. కానీ ఇంతలోనే ఓ మహిళ వచ్చింది. సీట్లో కూర్చున్న ఓ యువతిని లాగి పడేసింది. అదే పనిగా ఆమెపై దాడికి దిగింది. దీంతో మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా భీతిల్లారు. వామ్మో అంటూ భయపడ్డారు. ఈసంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గాని.. సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా వీడియోలు తెగ దర్శనమిస్తున్నాయి. ఇప్పడు ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

ఆ సంఘటన ఎక్కడ జరిగిందోతెలియదు. కానీ, ఆ రైలు బోగీలో చోటు చేసుకున్న సంఘటన మాత్రం యాక్షన్ సినిమాను తలపించింది. సీటు కోసం ఇద్దరు మహిళలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా కొట్టుకున్నారు. సీటు లో కూర్చున్న యువతిని ఓ మహిళ లాగిపడేసింది. అంతేకాదు, ఆమెను తీవ్రంగా దూషించింది. కిందపడిన ఆ యువతి వెంటనే తేరుకుని ఆ మహిళ పై దాడి చేసింది. ఇద్దరూ చాలా సేపు పోట్లాడుకున్నారు. బోగీలో ప్రయాణిస్తున్నవారు వారిద్దరినీ విడిపించడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

ఈ ముష్టి ఘాతాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సంచలనంగా మారింది. ఇప్పటికే అది లక్ష్లలలో వీక్ష్ణణలు సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత బాబోయ్ ఇదేం విడ్లూరమంటూ నోర్లు వెళ్లబెడుతున్నారు. రైలు బోగీని చేపలదుకాణం చేశారని మండిపడుతున్నారు. భారతదేశ పరవును తీయాలంటే శత్రవులు రావాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వారుంటే చాలని చెబుతున్నారు.

మనధేశంలో జనరల్ బోగీలలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కాకపోతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవి వెలుగులోకి వస్తున్నాయి. గతంలో వీధి కొళాయిల వద్ద ఈ తరహా ఫైటింగ్ లు జరిగేవి. ఇప్పుడు రైళ్లల్లో జనరల్ బోగీలలో జరుగుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జనరల్ బోగీల సంఖ్యను పెంచితే ఈ తరహా యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకోవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆ రైలు బోగీలో అంత ఫైటింగ్ జరిగినప్పటికీ ఏ ఒక్క రైల్వేఅధికారి, టీసీ అటు వైపుగా రాకపోవడం గమనార్హం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper