సాధారణంగా చాలామంది ఇళ్లల్లో అత్తాకోడళ్లకు పొసగదు. కొన్ని సందర్భాల్లో అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం, గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా హర్యానాలోని సోనిపట్ అనే ప్రాంతంలో 82 ఏళ్ల అత్తగారిని కోడలు కొట్టిన ఘటన విపరీతంగా వైరల్ అయింది. దీంతో పోలీసులు కోడలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే రామేహర్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
సోనిపేటలో అతని, తల్లి, భార్య పిల్లలతో కలిసి రామేహర్ నివాసం ఉంటున్నాడు. రామేహర్ భార్య అదే ప్రాంతంలో ఏ.ఎన్.ఎంగా పని చేసేది. అయితే గత కొన్ని నెలల నుంచి రామేహర్ భార్య, తల్లి మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి. రామేహర్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య అత్తకు పనులు చెప్పడంతో పాటు ఆ పనులు అత్త చేయకపోతే తీవ్ర అసహనం వ్యక్తం చేసేది.
ఒక ఇంట్లో చెప్పిన చేని చేయని అత్తను కోడలు డస్ట్ బిన్ తో చితకబాదింది. ఏడుస్తూ ఉన్న అత్తను చూసి మరింత గట్టిగా చితకబాదుతూ ఆమె ఏడిపించింది. స్థానికులు కోడలు అత్తను కొడుతున్న ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోడలు అత్తను కొడుతున్న సమయంలో కోడలి తల్లి కూడా కొట్టమని కూతురిని ప్రోత్సహిస్తూ ఉండటం గమనార్హం. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లీకూతుళ్లు సొంతూరికి పారిపోయారు. సోనిపట్ సిటీ పోలీసులు కోడలితో పాటు కోడలి తల్లిని అరెస్ట్ చేశారని సమాచారం.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Women arrested for beat the mother in law
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com