
కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడిన వేళ తారలు ఇప్పుడు తమ కిష్టమైన సోషల్ మీడియాలో సేదతీరుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు కన్నుల విందు చేస్తున్నారు.
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందంతో పటు నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తొలి చిత్రం ‘ధడక్’ మూవీ తో జాన్వీ అభిమానుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పాన్ ఇండియా మూవీ ‘తఖ్త్’లో నటిస్తుంది.
విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ మూవీ లో జాన్వీ నటిస్తుందనే వార్తలు హల్చల్ చేసాయి. కాని జాన్వీకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వాళ్ళే ‘లైగర్’ సినిమా వదులుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ లో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుందని చిత్రబృందం ప్రకటించారు.
తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓహాట్ ఫొటోను షేర్ చేసింది. పీకాక్ మేగజైన్ కవర్ పేజీగా తన ఫొటో వేశారని షేర్ చేసింది. ఎద అందాలు కనిపించేలా షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ గా మారింది. అభిమానులు అచ్చం శ్రీదేవి లానే చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఈ మ్యాగజైన్ పై కవర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CRjLz1qluJn/?utm_source=ig_web_copy_link