spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Kinjarapu Yerran Naidu: ఎర్రన్నకు టీడీపీలో అన్యాయం.. 1989లో ఏం జరిగింది ‘బాబూ’

Kinjarapu Yerran Naidu: ఎర్రన్నకు టీడీపీలో అన్యాయం.. 1989లో ఏం జరిగింది ‘బాబూ’

Kinjarapu Yerran Naidu
Kinjarapu Yerran Naidu

Kinjarapu Yerran Naidu: దివంగత ఎర్రన్నాయుడు తమ వాడంటే తమ వాడని తెలుగుదేశం పార్టీ గొంతు చించుకుంటోంది. బీసీ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్నను సైతం ఓన్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. ఎర్రన్న జయంతి, వర్థంతి సమయంలో రాష్ట్రస్థాయి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కీర్తిస్తూ వస్తోంది. కానీ అదే ఎర్రన్నాయుడు, గౌతు లచ్చన్న కుమారుడు శివాజీకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిన రోజులు ఉన్నాయి. 1989లో తెలుగుదేశం పార్టీ రెండోసారి కంటెస్ట్ చేసే సమయంలో చంద్రబాబుది యాక్టివ్ రోల్. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన చంద్రబాబు పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఆ సమయంలో వచ్చిన ఎన్నికల్లో ఎర్రన్నాయుడు, శివాజీలను చంద్రబాబు పక్కన పెట్టేశారు.

శ్రీకాకుళం జిల్లాలో హరిశ్చంద్రపురం నుంచి ఎర్రన్నాయుడు, సోంపేట నియోజకవర్గం నుంచి గౌతు శివాజీలు 1985లో టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ అప్పట్లో కళా వెంకటరావు, తమ్మినేని సీతారాంలు చంద్రబాబు కోటరీలో ఉండేవారు. ఎర్రన్నాయుడు, శివాజీలకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ వారిద్దరూ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థులపైనే గెలుపొందారు. కానీ నాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దీంతో ఐదేళ్ల పాటు ఎర్రన్నాయుడు, శివాజీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగారు. 1994 ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. టిక్కెట్లు పొందగలిగారు.

Kinjarapu Yerran Naidu
Kinjarapu Yerran Naidu

అటు తరువాత ఎర్రన్నాయుడు పార్టీలో తన స్థానాన్ని పెంచుకుంటూ వచ్చారు. పార్టీలో నంబర్ 2 గా ఎదిగారు. కానీ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కానీ ఆయన వారసులుగా ఉన్న అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా పదవులు నిర్వహిస్తున్నారు. శివాజీ వారసురాలిగా ఉన్న శిరీష్ టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. నాడు ఏనుగు గుర్తుపై పోటీచేసి అధికార, ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థులను ఎర్రన్న, శివాజీ వెనక్కి నెట్టగలిగారు. అందుకే ఇప్పటికీ ఎర్రన్నను ఏనుగుతో పోల్చుతారు. ఏనుగు చచ్చిన బతికినా గ్రేట్ అంటూ ఎర్రన్నను ఉద్దేశించి అభివర్ణిస్తుంటారు. టీడీపీలో అప్పట్లో నిరాదరణకు గురైన ఎర్రన్నను స్మరించడం ద్వారా చంద్రబాబు బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడాన్ని కూడా ఉదహరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper