ఎవరు మీలో కోటీశ్వరులు: జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం సంగతి తెలిసిందే. తమ ప్రతిభ ద్వారా సామాన్యులని కోటేశ్వరుని చేయడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. కౌన్ బనేగా కరోడ్పతి అనే పేరుతో హిందీలో ఈ షో మాత్రం అత్యంత ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తద్వారా షో నిర్వాహకులు దీన్ని తదితర భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. అలా తెలుగులో ఈ కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు గా రూపుదిద్దుకున్నది.
అయితే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న ఈ కార్యక్రమానికి ఎందరో సెలబ్రిటీస్ విచ్చేసారు. షో కర్టెన్ రైజర్ లో రామ్ చరణ్ హాజరు అయ్యి కార్యక్రమాన్నిపెద్ద హిట్ అయ్యే మార్గం దిశగా నడిపించారు. ఈ నేపథ్యం లో ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వాహకులు ప్రతి వారం వారం ఒక సెలబ్రిటీ గెస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు. అలా మూడో వారానికి గాను రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు హాజరై ఎన్టీఆర్ తో పాటు ప్రేక్షకులను అలరించారు.
ఎవరు మీలో కోటీశ్వరులుగా జెమినీ టీవిలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభం కాకముందు జెమినీ టీవీ రేటింగ్స్ చాలా దారుణం గా ఉండేవి. ఈ షో ప్రాంభమయ్యాక మిగతా ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తో పాటు దూసుకుపోతుంది. ప్రారంభమే సెలబ్రిటీ గెస్ట్ రాంచరణ్ తో మొదలవ్వగా అవ్వగా, దానికి గాను మంచి రేటింగ్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో లో సెలెబ్రిటీలు పాల్గునేటట్లు షో నిర్వాహకులు ప్లాన్ చేశారు.
అయితే కొరటాల శివ, రాజమౌళి పాల్గున్న మొత్తం ఎపిసోడ్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారో అన్న విషయం అర్ధం కావట్లేదు. షో కి రేటింగ్ రావట్లేదు, ఇంకా వ్యూస్ అయినా వస్తాయనే అపోహలో రాజమౌళి, కొరటాల శివ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని ఒక వర్గం ప్రేక్షకులు అనుకుంటున్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో విడుదల చేసారని మరొక వర్గం ప్రేక్షకులు అనుకుంటున్నారు.