HomeతెలంగాణVemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం ఒక ఆనవాయితీ. ఆలయానికి సమీపంలోనే బద్ది పోచమ్మ ఆలయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పోచమ్మకు బోనం సమర్పిస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడికి దగ్గర్లోనే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది.

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగానే కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు ధనం రూపంలో.. ఇంకొందరు వస్తువుల రూపంలో కానుకలను ఇస్తుంటారు. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి ఓ దంపతులు ఇచ్చిన విరాళం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అంతేకాదు ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

వేములవాడ రాజన్న ఆలయానికి ఇదే పట్టణానికి చెందిన సుభాష్ నగర్ వాస్తవ్యులు పసుల లక్ష్మీనారాయణ, జనాభాయ్ దంపతులు ఏడు లక్షల ఒక వెయ్యి 116 రూపాయలను విరాళంగా అందించారు. స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్టుకు దీనిని ఉపయోగించాలని వారు కోరారు. ఆ సమయంలో లక్ష్మీనారాయణ దంపతులకు గర్భగుడి దర్శనం కల్పించారు ఆలయ కమిటీ వారు. ఆ తర్వాత స్వామివారి శేష వస్త్రాలు.. కళ్యాణ లడ్డు వారికి అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల లక్ష్మీనారాయణ కుమార్తెలు ఆలయ నిర్వాహకుల దగ్గరికి వచ్చారు.. దర్శనం కోసమని నిర్వాహకులు అనుకున్నారు. కానీ వారు వచ్చింది దర్శనానికి కాదు..

లక్ష్మీనారాయణకు మతిస్థిమితం లేదని.. అందువల్లే ఏడు లక్షల రూపాయలను దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్టుకు అందించారని.. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రిలో చూపించాలని వారు ఆలయ అధికారులతో చెప్పారు. అంతేకాదు నిత్యాన్నదాన ట్రస్ట్ కు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఆలయ అధికారులను కోరారు. అయితే దీనిపై ఆలయ అధికారులు స్పష్టత ఇచ్చారు. నిత్య అన్నదాన ట్రస్టు మాత్రమే కాదని.. ఆలయ అభివృద్ధికి ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇవ్వడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. ఒకసారి విరాళం ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని వారు చెప్పారు. దీంతో లక్ష్మీనారాయణ కుమార్తెలు వెనుతిరి గారు. లక్ష్మీనారాయణ ఆలయానికి విరాళం ఇచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆయన కుమార్తెలు మాత్రం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే డబ్బులు ఇచ్చారని అంటున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper