HomeతెలంగాణTelangana Liquor Prices: మద్యం ధరలు పెంపు... జూలై 17న కీలక సమావేశం... ఇక 150...

Telangana Liquor Prices: మద్యం ధరలు పెంపు… జూలై 17న కీలక సమావేశం… ఇక 150 ఎంఎల్..

Telangana Liquor Prices: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరల సవరణకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం ధరల పెంచేందుకు ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఈ నెల 17న కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో కొత్త ధరల అమలు, బాటిళ్ల సైజుల్లో మార్పులు వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడున్న వాటికంటే మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితె..

మద్యం ధరల సవరణకు ముందు ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా ధరల నిర్ణయ కమిటీ ఇప్పటికే దాదాపు 10 దఫాలుగా మద్యం తయారీ సంస్థలు, డిస్టిలరీలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. ఉత్పత్తి వ్యయం, ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు, పన్నుల ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన చర్చల ఆధారంగా జూలై 17న జరిగే సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మద్యం ధరలు ఎంత మేర పెంచాలి, ఏయే బ్రాండ్లపై ఎంత సవరణ చేయాలి, ఎప్పటి నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకురావాలి వంటి అంశాలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం సమావేశం అనంతరం వచ్చే అవకాశముంది.

మద్యం తయారీ సంస్థలు ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గాజు సీసాలు, ప్యాకేజింగ్ మెటీరియల్, స్పిరిట్, రవాణా, కార్మిక వ్యయం వంటి ఖర్చులు పెరగడంతో ప్రస్తుత ధరల్లో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని కంపెనీలు కమిటీకి వివరించినట్లు సమాచారం. అందుకే ధరల సవరణ అవసరమని అవి కోరుతున్నట్లు తెలుస్తోంది.

ధరల పెంపుతో పాటు మద్యం బాటిళ్ల పరిమాణాల్లో మార్పులు చేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బాటిళ్లతో పాటు 150 మిల్లీలీటర్ల (150ml) చిన్న సైజు బాటిళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని కొన్ని కంపెనీలు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా కమిటీ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ధరలు పెరిగితే అన్ని రకాల బ్రాండ్లపై ఒకే స్థాయిలో ప్రభావం ఉంటుందా? లేక ప్రీమియం, మిడిల్, ఎకానమీ బ్రాండ్లకు వేర్వేరుగా ధరలు సవరించబడతాయా? అనే అంశాలపై కూడా ఆసక్తి నెలకొంది. తుది నిర్ణయం వెలువడిన తర్వాతే వినియోగదారులపై ఎంత మేర అదనపు భారం పడుతుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం మద్యం ధరల పెంపు, బాటిళ్ల సైజుల్లో మార్పులపై చర్చలు జరుగుతున్నప్పటికీ, అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు. జూలై 17న జరగనున్న సమావేశం అనంతరం ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వుల ఆధారంగానే కొత్త ధరలు, కొత్త ప్యాకేజింగ్ విధానం అమల్లోకి వచ్చే అవకాశముంది. అందువల్ల అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రతిపాదనల దశలో ఉన్నదిగా పరిగణించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular