
తెలంగాణలో విద్యాశాఖ అధికారల కొరత ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.ప్రస్తుతం కేజీ టు పీజీ వరకు ఆంగ్ల భాషలో బోధన ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారని, విద్యార్ధుల్లో చైతన్యం నింపిన ఘనత వారిదేనన్నారు. గత ఆరు సంవత్సరాల కాలంలో పదవీవిరమణ పొందిన ఉపాద్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.