
స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి అని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన మా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోయాడు. అతి చిన్న వయస్సులో స్వరాష్ట్రం కోసం అమరుడు కావడం బాధాకరమని అన్నారు. శ్రీకాంత చారి వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్నిసాధించుకున్నామని చెప్పారు.