కుటుంబ తగాదంలో తనను వదిలి పుట్టింటికి వెళ్లిన భార్య మళ్లీ రావడం లేదని, ఇందుకు పోలీసులు సహకరించడం లేదని ఓ వ్యక్తి హోర్టింగ్ టవరెక్కి నిరసన తెలిపాడు. మైలార్దేవ్పల్లి ప్రాంతానికి చెందిన బెల్లంపల్లి రాజు, భాగ్య దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అయితే తన భార్యను తీసుకురావాలని పోలీసులకు చెప్పినా సహకరించడం లేదని శుక్రవారం ఉదయం సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా ఉన్న హోర్డింగ్ టవరెక్కాడు. దీంతో రాయదుర్గం పోలీసులు ఎంత చెప్పినా దిగలేదు. చివరికి చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వగా తన భార్య భాగ్యను తీసుకువచ్చారు. ఆ తరువాత ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.