spot_img
Homeజాతీయ వార్తలుISRO satellite Anvesha: మన ‘అన్వేష్’ కక్ష చేరి ఉంటే అమెరికా, పాకిస్తాన్ వణికిపోయేవి..

ISRO satellite Anvesha: మన ‘అన్వేష్’ కక్ష చేరి ఉంటే అమెరికా, పాకిస్తాన్ వణికిపోయేవి..

ISRO satellite Anvesha: భారత్‌ ఇటీవల ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ చివరి నిమిషంలో విఫలమైంది. కక్ష్యలో ప్రవేశపెడుతున్న సమయంలో గురి తప్పింది. అది విజయవంతం అయి ఉంటే అమెరికా, పాకిస్తాన్‌ గుట్టు రట్టయ్యేది. కార్గిల్‌ వార్‌ మోసాలు వెలుగులోకి వచ్చేవి. పీఎస్‌ఎల్వీ విఫలంలో అగ్రరాజ్యం ఊపిరి పీల్చుకుంది.

సముద్ర మట్టం నుంచి 16 వేల అడుగుల ఎత్తులో, మైనస్‌ 10 డిగ్రీల చలిన మధ్య కార్గిల్‌ శిఖరాలు యుద్ధక్షేత్రంగా మారాయి. భారత సైనికులు ప్రాణాలు పణంగా పోరాడుతుంటే, శత్రు బంకర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఆధారపడిన అమెరికా జీపీఎస్‌ సిగ్నల్స్‌ ఒక్కసారిగా బలహీనపడ్డాయి. అమెరికా తన వ్యవస్థలో ’సెలెక్టివ్‌ అవైలబిలిటీ’ పద్ధతి ఉపయోగించి కచ్చితత్వాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించింది. 5 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యం 100 మీటర్లకు మారి కనిపించడంతో మన క్షిపణులు గురితప్పాయి. దీంతో ఢిల్లీ సౌత్‌ బ్లాక్‌ ఇతరులపై ఆధారఫడొద్దని నిర్ణయించుకుంది. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ అవసరాన్ని గుర్తించింది.

స్వాతంత్య్ర ప్రయాణం..
కార్గిల్‌ షాక్‌ తర్వాత భారత్‌ తన జీపీఎస్‌ వ్యవస్థను సృష్టించడానికి పర్వతాలు ఎక్కింది. మొదటి దశల్లో ’ఆపరేషన్‌ సింధూర్‌’ వంటి పనుల్లో 50 మీటర్ల సీఈపీ(సర్క్యులర్‌ ఎర్రర్‌ ప్రాబబుల్‌)తో పెద్ద ప్రాంతాలను లక్ష్యం చేశాం. కానీ ఆధునిక యుద్ధాలకు ’పిన్‌పాయింట్‌’ కచ్చితత్వం – 5 మీటర్ల లోపల – కావాలి. ఇస్రో పరమాణు గడియారాలతో (అటామిక్‌ క్లాక్స్‌) నవిక్‌ (NavIC)ని రూపొందించింది. ఇది ఇతరులపై ఆధారపడకుండా పనిచేస్తే సొంత వ్యవస్థ.

అన్వేష సక్సెస్‌ అయితే..
పీఎస్‌ఎల్వీ–సీ62 ద్వారా కక్ష్యకు పంపాల్సిన అన్వేష (EOS-N1) ఉపగ్రహం సాధారణ కెమెరా కాదు – అది శత్రు రహస్యాలను ఛేదించే ఆయుధం. హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ సాంకేతికతతో, ఇది వస్తువుల ’స్పెక్ట్రల్‌ సిగ్నేచర్‌’లను – ప్రత్యేక కాంతి తరంగాలను – వేలాది రంగులుగా విభజించి గుర్తిస్తుంది. పచ్చటి కవర్ల కింద దాచిన ట్యాంకులు లేదా కామొఫ్లాజ్‌లో ఉన్న ఇనుము, చెట్ల ఆకులతో తేడా చూపిస్తుంది. సాధారణ ఉపగ్రహాలు వీటిని మరచిపోతాయి, కానీ అన్వేష కచ్చిత స్థానాలను గుర్తుచేస్తుంది.

నావిక్‌.. అన్వేష మ్యాజిక్‌
అన్వేష డేటా నవిక్‌తో కలిస్తే, క్షిపణులు గాలిలో తిరిగి 5 మీటర్ల లోపల లక్ష్యాన్ని చేరుకుంటాయి. టెర్రరిస్ట్‌ గది కిటికీ లక్ష్యంగా మారుతుంది, మొత్తం భవనం కాదు. ఇఉ్క తక్కువగా ఉండటంతో ధ్వంసం పరిమితం, ప్రభావం గణనీయం.

విఫలమైనా కల ముగియలేదు..
శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ62 మూడో దశలో విఫలమైంది. అన్వేష సముద్రంలో పడిపోయింది. ఇది 16 ఉపగ్రహాలతో కలిసి భూమి గ్రావిటీలోకి తిరిగి వచ్చి కాలిపోతాయి. దీంతో పాకిస్తాన్, అమెరికా తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నాయి. కానీ కార్గిల్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఆగదు. ఇస్రో మళ్లీ ప్రయత్నిస్తుంది – 50 మీటర్ల నుంచి 5 మీటర్లకు మార్పు తప్పకుండా జరుగుతుంది. ఇది భారత్‌కు అన్ని రకాల వాతావరణాల్లో శత్రువును ఎప్పటికీ పట్టుకునే శక్తినిస్తుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper