Homeక్రీడలుక్రికెట్‌Indian T20 Team Changes: IPL తర్వాత టీ20 జట్టులో పెను మార్పులు.. సూర్య కుమార్...

Indian T20 Team Changes: IPL తర్వాత టీ20 జట్టులో పెను మార్పులు.. సూర్య కుమార్ యాదవ్ లో భయం భయం

Indian T20 Team Changes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా ఆడుతున్నాయి. ఫలితాలు కూడా అంచనాలకు అందని విధంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తర్వాత భారత టి20 జట్టులో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియాలో ఈ దిశగా ప్రధానంగా వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి. టి20 ఫార్మాట్ లో ప్రధానంగా అనేక మార్పులను మేనేజ్మెంట్ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. టి20 జట్టు సారధిగా అయ్యర్ […]

Indian T20 Team Changes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా ఆడుతున్నాయి. ఫలితాలు కూడా అంచనాలకు అందని విధంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తర్వాత భారత టి20 జట్టులో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియాలో ఈ దిశగా ప్రధానంగా వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి. టి20 ఫార్మాట్ లో ప్రధానంగా అనేక మార్పులను మేనేజ్మెంట్ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. టి20 జట్టు సారధిగా అయ్యర్ ను బీసీసీఐ ఎంపిక చేస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో టి20 సిరీస్ లు ఆడనుంది. ఈ సిరీస్ బాధ్యతలు మొత్తం సర్పంచ్ సాబ్ కు అప్పగిస్తారని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ టీమిండియా కు నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతుంది. జాతీయ మీడియాలో సూర్య కుమార్ యాదవ్ ను పక్కనపెట్టి.. అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.. కేవలం ఈ టోర్నీలు మాత్రమే కాకుండా.. 2028 వరల్డ్ కప్, లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్ పోటీలను దృష్టిలో పెట్టుకొని కూడా అతడికి కెప్టెన్సీ అప్పగిస్తారని తెలుస్తోంది.

సూర్య కుమార్ యాదవ్ సారధిగా ఓకే అయినప్పటికీ.. ఆటగాడిగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కీలకమైన సమయాలలో సరిగా ఆడలేక పోతున్నాడు. ఆటగాడిగా అతడు విఫలమవుతున్న తీరు జట్టు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా ఇంతవరకు ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. చివరికి 2026 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. సారధిగా అతడు జట్టును అద్భుతమైన స్థాయిలో ముందు వరుసలో నిలుపుతున్నాడు. కానీ, ఆటగాడిగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

అయ్యర్ ప్రస్తుతం తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడుతున్నాడు. అందువల్లే అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు మేనేజ్మెంట్ సిద్ధంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ విషయాల మీద క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఒకవేళ సారథిగా పక్కన పెడితే.. సాధారణ ఆటగాడిగానే సూర్య కుమార్ యాదవ్ ఉండి పోవాల్సి ఉంటుందని తెలుస్తోంది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper