Indecent Incidents Cricket History: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. కానీ ఈ జెంటిల్మెన్ గేమ్ లో కూడా కొన్ని తలదించుకునే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. క్రికెట్లో ఇప్పటి వరకు అనేక సార్లు షేమ్ ఫుల్ సంఘటనలు జరిగాయి. అటువంటి వాటి గురించి మనము తెలుసుకుందాం. క్రికెట్ లో కొన్నిసార్లు తిట్టుకోవడం దగ్గర నుంచి కొట్టుకోవడం దాకా వెళ్ళిన సందర్భంలో ఉన్నాయి. కానీ, ఎక్కువ సందర్భాల్లో కొట్టుకోలేదు.
ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో..
ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ జావెద్ మియాందాద్ ఆస్ట్రేలియా బౌలర్ బిల్లీ వేసిన బంతిని ఎదుర్కొని రన్స్ కోసం పరిగెడుతున్న సమయంలో ఢీకొట్టాడు. చెప్పాలంటే ఢిల్లీ కావాలని జావెద్ కు అడ్డుగా వచ్చాడు. అక్కడితో ఆగకుండా అంపైర్ దగ్గర ఉన్న స్వెటర్ తీసుకుంటూ పక్కనే ఉన్న జావెద్ ను కాలితో తన్నాడు. దీంతో జావెద్ కు కోపం వచ్చి బిల్లిని బ్యాట్ తో కొట్టబోయాడు. కానీ, అంపైర్ అతన్ని ఆపి ఇద్దరినీ కూల్ చేసి పంపించాడు.
భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లో..
భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య టి20 వరల్డ్ కప్ లో పాక్ బౌలర్ షాహిద్ అఫ్రిది భారత జట్టులో ముగ్గురు దగ్గర ఆటగాళ్లను అవుట్ చేసి, ఇండియాలో కూడా ఒడించాలనే కోరికను తీర్చాడు. ఆ తర్వాత మ్యాచ్ లో అఫ్రిది బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాక్ ఆడియన్స్ ముందు మ్యాచ్ లో అవుట్ అయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పేర్లను పదేపదే అరుస్తూ ఉన్నారు. వారి అరుపులు విన్న అఫ్రిది ఆ ముగ్గురు బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అయ్యారో ఇమిటేట్ చేసి చూపించారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇలా చేయడం సిగ్గు చేటని చెప్పవచ్చు.
అభిమానులు చేసిన పనిని అసహ్యించుకున్న కామెంటేటర్లు..
అతిధి దేవోభవ అని అంటుంటారు. కానీ ఈ విషయం ఇంగ్లాండ్ ఫాన్స్ మాత్రం పాటించలేదు. క్రికెట్ దేవాలయంగా భావించే లార్డ్స్ మైదానంలో ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ పై ఇంగ్లాండ్ అభిమానులు షంపైన్ బాటిల్ క్యాప్స్ విసిరేశారు. దీన్ని చూసిన విరాట్ కోహ్లీ వాటిని తిరిగి వారిపైకి విసిరేయమని అన్నాడు. ఫ్యాన్స్ చేసింది చూసిన కామెంటేటర్స్ కూడా వాళ్ళు చేసిన పనికి అసహ్యించుకున్నారు.
వికెట్లను తన్నిన షకిబుల్ హసన్..
క్రికెట్లో ఎంపైర్ నిర్ణయాన్ని ఫైనల్ డెసిషన్ గా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్లేయర్స్ అత్యుత్సాహంతో టెంపర్మెంట్ తో ఎంపైర్ అరుస్తూ ఉంటారు. ఇలాంటిదే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో సకిబ్ అల్ హసన్ బౌలింగ్ చేస్తూ ఎల్బీడబ్ల్యూ కోసం పదేపదే అప్పీల్ చేశాడు. కానీ ఎంత స్పందించకపోవడంతో షకిబ్ కోపంగా వెళ్లి స్టంప్స్ తన్నాడు. ఆ తరువాతి ఓవర్లో ఎంపైర్ తో వాదించాడు. అక్కడితో ఆగకుండా స్టంప్స్ ను తీసి పడేశాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా అతని భీభత్సంగా టోల్ చేశారు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బోర్డు ఐదు లక్షలు జరిమాన, మూడు మ్యాచ్ ల నిషేధాన్ని విధించింది.
ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేయడంతో..
ఇండియా – శ్రీలంక మధ్య జరిగిన ఒక మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సెహ్వాగ్ సెంచరీకి ఇంకా ఒక పరుగు అవసరం ఉన్న సమయంలో.. సూరజ్ రందీప్ సెంచరీని అడ్డుకోవడానికి చివరి బంతిని ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేశాడు. దాన్ని సిక్సర్ కొట్టాడు. భారత్ గెలిచింది. కానీ, సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యాడు. నోబాల్ వేసిన సూరజ్ కు ఒక మ్యాచ్ నిషేధం విధించారు.
మిడిల్ ఫింగర్ చూపించిన విరాట్ కోహ్లీ..
2012 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వాటిని విన్న కోహ్లీ వాళ్లకు తన మిడిల్ ఫింగర్ చూపించాడు. అలా చేసినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. అలాగే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తర్వాత తప్పు తెలుసుకుని ఇలా చేయడం తప్పే.. కానీ వాళ్లు నీ తల్లి.. చెల్లి అంటూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఏం చేయాలి అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
శ్రీలంక జట్టుపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు..
2009లో పాకిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ కోసం శ్రీలంక జట్టు లాహోర్లోని గడాఫీ స్టేడియానికి వెళుతుండగా, తాళిబన్లకు చెందిన ఉగ్రవాదులు వారి బస్సు పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు, సిబ్బంది గాయపడ్డారు. వెంటనే ఆ మ్యాచ్ రద్దు చేసుకుని శ్రీలంక ప్లేయర్స్ ను క్రికెట్ గ్రౌండ్ లోనే హెలిక్యాప్టర్ ఎక్కించి, శ్రీలంకకు తీసుకెళ్లారు. ఆరోజు నువ్వు క్రికెట్ చరిత్రలోనే బ్లాక్ డే గా పరిగణించారు.
కొట్టే ప్రయత్నం చేసిన ఆ క్రికెటర్..
క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల మధ్య స్నేహం, అవగాహన ఉంటే ఆ జట్టు రాణిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో బ్యాట్స్మెన్ కొట్టిన ఒక బాల్ ను పట్టుకోవడానికి బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్, వికెట్ కీపర్ ముస్ఫికర్ రహీమ్ ఇద్దరు వెళ్లారు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఢీకొన్నారు. రహీమ్ బాల్ ను పట్టుకున్నాడు. అయినా కోపంతో నసుమ్ అహ్మద్ ను కొట్టడానికి చేయి పైకి ఎత్తాడు. కానీ, తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగాడు.
బ్యాట్ విసిరేసి వెళ్లిపోయిన బ్యాటర్..
1981లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవాలంటే చివరి బంతికి ఆరు పరుగులు చేయాలి. అంటే చివరి బంతిని సిక్స్ కొడితే న్యూజిలాండ్, కొట్ట లేకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుంది. అయితే ఆశిష్ బౌలర్ బంతిని కొట్టడానికి వీలు లేకుండా వేశాడు. దీంతో న్యూజిలాండ్ ఓడిపోయింది. బాట్స్ మెన్ కోపంతో బ్యాట్ విసిరేసి వెళ్లిపోయాడు. బాల్ అలా వేయడం తప్పు కానప్పటికీ, క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. న్యూజిలాండ్ ఫ్యాన్స్ తోపాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా ఆ బౌలర్ పై ఆగ్రహించారు. రెండు దేశాల ప్రధాన మంత్రులు కూడా దీన్ని విమర్శించారు. అయితే, దీన్ని చాపెల్ బ్రదర్స్ కావాలని చేశారు.
స్టేడియంలో విసిరేసి సీట్లకు నిప్పు పెట్టారు..
1996లో ఇండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో దేశమంతా సిగ్గుపడే సంఘటన జరిగింది. భారత్ 15.5 ఓవర్లలో 120 పరుగులు వద్ద ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో భారత అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రౌండ్ లోకి బాటిల్స్, చెప్పులు విసిరేసి, సీట్లకు నిప్పు అంటించారు. మ్యాచ్ ను 30 నిమిషాలపాటు ఆపారు. తరువాత మ్యాచ్ మొదలు పెట్టగా పరిస్థితి అలాగే ఉండడంతో డిఫాల్ట్ గా శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. మార్చి 13, 1996 క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అలాగే, షేమ్ ఫుల్ ఇన్సిడెంట్ లో ఈ సంఘటన ముందు వరుసలో ఉంటుంది.